నెక్ట్స్ ఆస్కార్ మాదే అంటున్న తమన్

సౌత్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే.. అందులో తమన్ పేరు తప్పకుండా వినిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈయన పేరు కాకుండా మరో పేరు కూడా ఇప్పుడు చెప్పలేని పరిస్థితుల్లో ఈయన పడేస్తున్నాడు. తన క్లాస్ అండ్ మాస్ మ్యూజిక్ తో కట్టి పడేస్తున్నారు. ఒకటి రెండు కాదు ఏడాది పొడుగునా ఏ పోస్టర్‌పై చూసినా కూడా ఆయన పేరే కనిపిస్తోంది. ఇక విషయానికొస్తే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్, తమన్ కి మధ్య మంచి అనుబంధం ఉందన్న సంగతి తెలిసిందే. వీళ్ళ కాంబో కు స్పెషల్ క్రేజ్ ఉంది. అలా వైకుంఠపురం లో సినిమా పాటలతో అంతర్జాతీయ స్థాయిలో అలరించారు. వీరి పాటలకు ఇంటర్నేషనల్ ఆడియన్స్ సైతం ఉర్రూతలూగారు.

అయితే ఇటీవలే రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు కీరవాణి సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ నామినేషన్ దక్కింది. దీంతో రాజమౌళి, కీరవాణి పేర్లు మరోసారి అంతర్జాతీయ స్థాయిలో మార్మోగిపోయింది. ఈ క్రమంలోనే తమన్ కు ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. అదేంటంటే.. ఆస్కార్ కి రాజమౌళి గారు ఒక బాట వేశారు. మరి మీరు ఎప్పుడు వెళ్ళబోతున్నారు ? అని అడగగా..

అప్పుడు ఆయన మాట్లాడుతూ.. త్రివిక్రమ్ నన్ను అక్కడికి తీసుకెళ్తారు. మా ఇద్దరి మధ్య అనుబంధం చాలా బాగుంది. ఆయనతో కలిసి ఆస్కార్ అందుకుంటాను అని అన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇకపోతే ఇటీవలే తమను అందించిన వారసుడు, వీర సింహారెడ్డి సినిమాలకు తమన్ మ్యూజిక్ అందించారు. ఆ సినిమాలోని పాటలు సెన్సేషనల్ హిట్ అయ్యాయి. ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. బాలయ్యకు, విజయ్‌ కు అదిరిపోయే హిట్ సాంగ్స్ ఇచ్చాడు. సినిమాల్లో బీజీఎం కూడా నెక్ట్స్ లెవెల్ లో ఉందని అన్నారు. తమన్ పాటలు కాపీ చేశాడంటూ ఆ మధ్య ట్రోల్స్ కూడా వచ్చాయి. అది పక్కన పెడితే ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ఎస్ఎస్ఎంబీ 28కు పని చేస్తున్నారు.