‘టైగర్ 3’లోని సర్‌ప్రైజ్‌లను స్పాయిలర్స్‌ రూపంలో రివీల్ చేయకండి.. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ రిక్వెస్ట్

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ ‘టైగర్ 3’. ఇమ్రాన్ హష్మి ఇందులో కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రంలో ప్రేక్షకులు ఊహించని సర్‌ప్రైజ్‌లు ఎన్నో ఉన్నాయి. అయితే వాటిని ముందురోజు థియేటర్స్‌లో చూసిన ప్రేక్షకులు బయటకు చెప్పవద్దని సల్మాన్, కత్రినా, ఇమ్రాన్ రిక్వెస్ట్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా సల్మాన్ ‘‘చాలా ప్యాషన్‌తో టైగర్ 3 చిత్రాన్ని రూపొందించాం. అయితే ఇక్కడ స్పాయిలర్స్ నుంచి సినిమాకు రక్షణ అవసరం అనిపిస్తుంది. ఎందుకంటే సినిమాను ముందుగా చూసేవాళ్లు సినిమాకు సంబంధించిన సర్‌ప్రైజ్‌లను బయట పెడితే ఆడియెన్స్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ మిస్ అవుతుంది. కాబట్టి అలాంటి పని చేయకండి. ఈ దీపావళికి టైగర్ 3 మీ అందరికీ మంచి బహుమతి అని మేం భావిస్తున్నాం’’ అన్నారు.

Link:

https://twitter.com/BeingSalmanKhan/status/1723212653433344169?t=66jGpl9XKVatl1NG0oCfZg&s=19

కత్రినా కైఫ్ మాట్లాడుతూ ‘‘టైగర్ 3 చిత్రంలో ప్రేక్షకులు ఊహించని సర్‌ప్రైజ్‌లుంటాయి. ఇది ప్రేక్షకుడికి ఓ అందమైన అనుభూతినిస్తాయి. కాబట్టి టైగర్ 3కి సంబంధించిన స్పాయిలర్స్‌ను బయటకు రివీల్ చేయకండని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ భారీ చిత్రాన్ని రూపొందించటానికి చాలా మంది అహర్నిశలు కష్టపడ్డారు. వారి కష్టాన్ని వృథా కానీయకండి. కచ్చితంగా సినిమా అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది. హ్యాపీ దీపావళి’’ అన్నారు.

Link:
https://instagram.com/stories/katrinakaif/3233487216516076056?utm_source=ig_story_item_share&igshid=anNqZmVhMmNhNThi

ఇమ్రాన్ హష్మి మాట్లాడుతూ ‘‘టైగర్ 3 వంటి సినిమాలో చాలా ట్విస్టులు, టర్నులుంటాయి. వాటిని చాలా జాగ్రత్తగా బయటకు పొక్కనీయకుండా చూడండి. స్పాయిలర్స్ రూపంలో వాటిని బయట పెడితే తదుపరి సినిమాను చూసే ప్రేక్షకుడికి బ్యూటీఫుల్ ఎక్స్‌పీరియెన్స్ మిస్ చేసినవాళ్లం అవుతారు. ఈ విషయంలో ప్రేక్షకులు తమ సహకారాన్ని అందిస్తారని భావిస్తున్నాం. హ్యాపీ దీపావళి’’ అన్నారు.

Link:
https://x.com/emraanhashmi/status/1723213396173300199?s=46&t=NUtOzfQa2_PTnT7Cp754NQ

ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌లో ఇప్పటి వరకు ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్ వంటి బ్లాక్ బస్టర్స్ ఆడియెన్స్‌ని అలరించారు. ఇప్పుడు ఈ స్పై యూనివర్స్‌లో భాగంగా టైగర్ 3 మెప్పించనుంది. మనీష్ శర్మ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మాణంలో రూపొందిన ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని హిందీ, తమిళ, తెలుగు భాషల్లో నవంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.