‘రజాకార్’ చిత్రం నుంచి ‘ప్రాణం గడ్డిపోస అనుకో…’ అనే లిరిక‌ల్ సాంగ్ రిలీజ్

బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ‌, ఇంద్ర‌జ‌, మ‌క‌రంద్ దేశ్ పాండే నటీనటులుగా స‌మ‌ర్ వీర్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై యాటా స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో గూడూరు నారాయ‌ణ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘రజాకార్’. త్వ‌ర‌లోనే విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న ఈ సినిమా నుంచి ‘ప్రాణం గడ్డిపోస అనుకో…’ అనే లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. భీమ్స్ సిసిరోలియో సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న సినిమాలోని ‘ప్రాణం గడ్డిపోస అనుకో…’ పాట‌ను స్టార్ సింగర్ శంక‌ర్ మ‌హాదేవ‌న్ పాడారు. నేష‌న‌ల్ అవార్డ్ గ్ర‌హీత సుద్ధాల అశోక్ తేజ సాంగ్‌ను రాశారు. ఈ సందర్బంగా…

చిత్ర దర్శకుడు యాటా సత్యనారాయణ మాట్లాడుతూ ‘‘మా సినిమాలోని ఎమోషన్‌ని అర్థం చేసుకుని పాటను సుద్దాలగారు అద్భుతంగా రాశారు. భీమ్స్ సిసిరోలియో సంగీతంతో పాటకు ప్రాణం పోశారు. శంకర్ మహదేవన్‌గారు పాడిన పాట వింటుంటే గూజ్ బమ్స్ వస్తున్నాయి. ఇది మన పూర్వీకులను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పిస్తూ చేసిన సినిమాయే రజాకార్. త్వరలోనే సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తాం’’ అన్నారు.

నిర్మాత గూడూరు నారాయ‌ణ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘రజాకార్లను ఉద్దేశించి మాత్రమే ఈ సినిమాను తీశాం. మా సినిమాలో మెయిన్ థీమ్‌ని వివ‌రించే ‘ప్రాణం గడ్డిపోస అనుకో…’ అనే లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను విడుద‌ల చేశాం. పాట‌ను అద్భుతంగా రాసిన సుద్దాల అశోక్ తేజ‌గారికి, పాట పాడిన శంక‌ర్ మ‌హ‌దేవ‌న్‌గారికి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ భీమ్స్ సిసిరోలియోగారికి థాంక్స్‌. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం’’ అని అన్నారు.