‘లూసిఫర్‌’ సీక్వెల్‌కు సన్నాహాలు!

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ , మంజు వారియర్‌, వివేక్‌ ఒబెరాయ్‌ , టోవినో థామస్‌ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ‘లూసిఫర్‌’ ఈ సినిమాకు మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వం వహించాడు. పొలిటికల్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం 2019 కేరళలో బిగ్గెస్టు బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఇక ఇదే సినిమాను మెగాస్టార్‌ చిరంజీవి గాడ్‌ ఫాదర్‌ పేరుతో తెలుగులో రీమేక్‌ చేశాడు. ఈ చిత్రానికి ‘తని ఓరువన్‌’ ఫేమ్‌ మోహన్‌ రాజా దర్శకత్వం వహించాడు.

ఇక్కడ కూడా ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. కాగా ఈ చిత్రం నుంచి సీక్వెల్‌ వస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘లూసిఫర్‌ 2’ ఎంపురాన్‌ అనే టైటిల్‌తో ఈ సినిమా రానుండగా.. ఈ మూవీ నుంచి ఓ సాలిడ్‌ అప్‌డేట్‌ వచ్చింది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన కొత్త అప్‌డేట్‌ బయటకు వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం ‘లూసిఫర్‌ 2’ ఎంపురాన్‌ ప్రోమోకు సంబంధించి షూటింగ్‌ వచ్చే వారం ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అలాగే ఫస్ట్‌ షెడ్యూల్‌కు సంబంధించి దేశ రాజధాని ఢల్లీిలో అక్టోబర్‌ మొదటి వారం నుంచి షూటింగ్‌ మొదలు పెట్టబోతున్నట్లు తర్వాత అక్కడ నుంచి లడఖ్‌లో షూటింగ్‌ జరుపుకోనున్నట్లు సమాచారం.

ఇక సీక్వెల్‌కు కూడా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వం చేయనుండగా మురళి గోపి స్టోరీ అందిస్తున్నాడు. కాగా ఇందులో సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ మరింత స్టైలిష్‌గా కనిపించనున్నట్లు టాక్‌.