సినిమాలు ఎలా ఉన్నా.. తమన్నా మాత్రం టాప్‌!

మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలో అడుగు పెట్టి సుదీర్ఘ కాలం అయినా కూడా ఇప్పటికీ కూడా బిజీగానే ఉంది. గత మూడు నాలుగు సంవత్సరాలుగా తమన్నా కెరీర్‌ ఆశాజనకంగా లేదని, కమర్షియల్‌ గా సక్సెస్‌ లు దక్కడం లేదని.. ఆమె పనై పోయిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ అందరి అంచనాలు తారుమారు చేస్తూ బిజీగా ఉంది. సక్సెస్‌.. ప్లాప్‌ లతో సంబంధం లేకుండా తమన్నా వరుసగా సినిమాలు, సిరీస్‌ లతో దూసుకు పోతుంది. సినిమాల్లో ఛాన్స్‌ లు తక్కువ ఉన్న సమయంలో సిరీస్‌ ల్లో మరియు మ్యూజిక్‌ ఆల్బం ల్లో కూడా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తూ ఉంది. తాజాగా ‘భోళా శంకర్‌’ మరియు ‘జైలర్‌’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘జైలర్‌’ సినిమాలో ఈమె పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత దక్కలేదు. భోళా శంకర్‌ సినిమా కూడా ఈమె కెరీర్‌ కు పెద్దగా హెల్ప్‌ అయింది లేదు. అయినా కూడా మిల్కీ బ్యూటీ తమన్నా బిజీ గానే ఉంది. నిన్న మొన్ననే ఆ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమన్నా వెబ్‌ సిరీస్‌ తో రెడీ అవుతోంది. ఆఖ్రీ సచ్‌ అనే వెబ్‌ సిరీస్‌ తో తమన్నా ఈనెల 25న డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఢిల్లీలోని బురారీ మరణ ఘటన ఆధారంగా రూపొందించిన ఈ వెబ్‌ సిరీస్‌ పై అంచనాలు భారీగా ఉన్నాయి.

తాజాగా విడుదల అయిన ట్రైలర్‌ కి మంచి రెస్పాన్స్‌ రావడంతో సిరీస్‌ మంచి స్పందన దక్కించుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. రాబీ గ్రేవాల్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్‌ లో అవిషేక్‌ బెనర్జీ, శివాని నారంగ్‌, కృతి విజ్‌, సంజీవ్‌ చోప్రా, రాహుల్‌ బగ్డా, నిఖిల్‌ నంద వంటి ముఖ్య నటీ నటులు నటించారు. ఈ సిరీస్‌ లో తమన్నా పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందనే టాక్‌ వినిపిస్తుంది. ఈ సిరీస్‌ విడుదల అయిన వెంటనే తమన్నా మళ్లీ సినిమాలు, సిరీస్‌ లతో రెడీగా అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మొత్తానికి మిల్కీ బ్యూటీ తమన్నా చిన్న గ్యాప్‌ కూడా ఇవ్వడం లేదు. సీనియర్‌ హీరోయిన్స్‌ లో ఇంత బిజీగా ఉండటం కవేలం
తమన్నాకే చెల్లింది అంటూ ఆమె అభిమానులతో పాటు ఇండస్టీ వర్గాల వారు ఇకా విూడియా సర్కిల్స్‌ వారు మాట్లాడుకుంటున్నారు. ఇదే జోష్‌ తో కొనసాగితే మరో అయిదు ఆరు సంవత్సరాల పాటు తమన్నా వినోదాన్ని పంచే అవకాశాలు కనిపిస్తున్నాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.