మిస్టరీ (Mystery) సినిమా షూటింగ్ ప్రారంభం

పి.వి.ఆర్ట్స్ పతాకం పై వెంకట్ పులగం నిర్మాతగా తల్లాడ సాయికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ” మిస్టరీ”. తల్లాడ సాయికృష్ణ, స్వప్న చౌదరి, సుమన్, ఆలీ, తనికెళ్ళ భరణి, రవి రెడ్డి, దుగ్గిరెడ్డి వెంకట్ రామ్ రెడ్డి, పులగం వెంకట్, సత్య శ్రీ,గడ్డం నవీన్, షన్ను , సి.కే. రెడ్డి , శోభన్ బోగరాజు, నేత సింగ్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయింది. జులై 3 నుండి 21 వరకు హైదరాబాద్ మరియు పరిసరప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంది. సింగల్ షెడ్యూల్ లో సినిమా షూటింగ్ అంత పూర్తి అవుతుంది. సెప్టెంబర్ చివరి వారం లో విడుదల కు ప్లాన్ చేస్తున్నారు. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం. సీనియర్ నటులు అలీ, సుమన్, తనికెళ్ళ భరణి ఈ చిత్రం లో కీలకపాత్ర పోషిస్తున్నారు.

ఈ సినిమా కి మాటలు- శివ కాకు, సంగీతం- రామ్ తవ్వ, కెమెరా – సుధాకర్, శివ రాథోడ్, అసోసియేట్ కెమెరా- శివ లు చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపారు.