అక్టోబర్ 13న”మిస్టరీ” విడుదల

పి.వి.ఆర్ట్స్ బ్యానర్ పైన వెంకట్ పులగం నిర్మాత , తల్లాడ సాయికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “మిస్టరీ”.

తనికెళ్ల భరణి, అలీ, సుమన్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా లో సాయికృష్ణ,స్వప్న చౌదరి హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత వెంకట్ పులగం మాట్లాడుతూ… “సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది, అక్టోబర్ 13 న విడుదల చేస్తున్నాం” అని తెలిపారు.

డైరెక్టర్ తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ… ఇది ఒక కామెడీ త్రిల్లర్ సినిమా, అవుట్ పుట్ చాలా బాగా వస్తుంది,ఈ రోజు టీం సభ్యులు ఉన్న పోస్టర్ ని విడుదల చేసాం , ఈ ప్రాజెక్టు నేను చేయడానికి సహకారం చేసిన మా టీం సబ్యులకు ధన్యవాదాలు. అలాగే వెంకట్ దుగ్గి రెడ్డి,రవి రెడ్డి, బాబీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను” అని అన్నారు.

హీరోయిన్ స్వప్న చౌదరి మాట్లాడుతూ… “మంచి కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా అనేక ట్వీట్స్ తో ప్రేక్షకులని మెప్పిస్తుంది, వినాయక చవితి శుభాకాంక్షలు అని అన్నారు.

సత్య శ్రీ, గడ్డం నవీన్, అకెల్లా, షన్ను, సి.కే.రెడ్డి, శోభన్ లు నటిస్తున్న ఈ సినిమా కి కథ మాటలు- శివ కాకు, సంగీతం- రామ్ తవ్వ , కెమెర – సుధాకర్ బార్ట్లే, ఎడిటింగ్ – సూర్య తేజ గంజి.