Malaysian Ugadi Puraskar: మలేషియన్ ఉగాది పురస్కార్ లో ‘మన్యంధీరుడు’కి ఉత్తమ చిత్ర అవార్డు

Malaysian Ugadi Puraskar: మలేషియన్ ఉగాది పురస్కార్ అవార్డు 2026 గాను ఆర్.వి.వి సత్యనారాయణ నటించి, నిర్మించిన ‘మన్యంధీరుడు’కు ఉత్తమ చిత్రం అవార్డు లభించింది. మలేషియా తెలుగు సంఘం క్లాంగ్ శాఖ ఆధ్వర్యంలో సుందర్ పెరుమాళ్ ఆలయం ఆడిటోరియంలో అత్యంత వైభవంగా జరిగిన ఉగాది వేడుకలలో ‘ఉగాది పురస్కార్ 2026 ఉత్తమ చిత్ర అవార్డు’ను మన్యం ధీరుడు చిత్రానికి ప్రదానం చేశారు. మలేషియా తెలుగు సంఘం చైర్మన్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉగాది వేడుకల్లో ముఖ్య అతిథిగా కాంగ్ ఉత్తర జిల్లా పోలీస్ కమిషనర్ విజయరావు చేతుల మీదుగా ఆర్.వి.వి సత్యనారాయణ, ఆర్.పార్వతీదేవి దంపతులను ఘనంగా సత్కరించి ఈ పురస్కార అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిధులుగా సుబ్రమణ్యం రామానాయుడు కమిటీ మెంబర్స్ 600 మంది తెలుగు సంఘం సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ముఖ్యఅతిథి పోలీస్ కమిషనర్ విజయరావు మాట్లాడుతూ.. మన తెలుగు వారికి ఆత్మగౌరవాన్ని విప్లవ వీరుడు అల్లూరు సీతారామరాజు గాధను ‘మన్యంధీరుడు’ పేరును తెరకెక్కిచ్చి.. భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన ఆర్.వి.వి సత్యనారాయణకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సినిమాలో దేశభక్తిని చాటుతూ ఒక దేశభక్తి గీతాన్ని ఆలపించి ఆ గీతం భారతదేశంలో ప్రతి పౌరుడు ఆలపించే విధంగా ఆ పాటను తీర్చిదిద్దారు అని కొనియాడారు.

Dasari Vignan Reveals Shocking Facts Behind Markapuram Bus Incident | AP Latest News | Telugu Rajyam