Manyam Dheerudu: ‘మన్యం ధీరుడు’లోని ‘నమోస్తుతే నమోస్తుతే భారత మాతా’ గీతానికి ప్రపంచ వ్యాప్త ప్రాచుర్యం !

Manyam Dheerudu: మన్యం ధీరుడు సినిమాలోని (Manyam Dheerudu) “నమోస్తుతే నమోస్తుతే భారత మాతా” అనే దేశభక్తి గీతం ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందుతున్నది. ఈ సినిమా కధానాయకుడైన ఆర్ వి వి సత్యనారాయణ (RVV Satyanarayana) స్వయంగా స్వరకల్పన చేసి పాడి హిమాలయాల్లో చిత్రీకరించడం తో ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.

మన్యం ధీరుడు… మెప్పించే ఓ విప్లవ వీరుడి కథ

ఈపాటను ఇటీవల కాలంలో థాయిలాండ్, మలేషియా,బ్యాంకాక్,మైన్మార్ లాంటి దేశాలలో ప్రవాస భారతీయులు విదేశీయులతో సహా మన దేశ గాయకులకు పలు ప్రశంసలందిస్తున్నారు త్వరలో అమెరికాలో గల థానా మరియు జెర్మనీ లో కూడా ఈ పాటను పాడబోతున్నామని విశాఖకు చెందిన శేఖర్ ముమ్మో జీ బృందం తెలియజేసారు. ఈ పాటకు తుంబలి శివాజీ సాహిత్యాన్నందించారు. భారత దేశ ఔన్యత్యాన్ని చాటి చెప్పే ఈ అద్భుతమైన పాట ఇంకా ఎంతో ప్రాచుర్యం పొందాలని ఆశిద్దాం.

Common Man Fires On Ys Jagan Comments Over Chandrababu Govt || Pawn Kalyan || Ap Public Talk || TR