కమర్షియల్ హీరోల మీటర్ లోకి ఎంటర్ అయిన కిరణ్ అబ్బవరం

స్వయంకృషితో తెలుగు సినిమా పరిశ్రమలో నిలదొక్కకుంటోన్న హీరో కిరణ్ అబ్బవరం. ఇప్పటికే మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా విడుదలైన వినరో భాగ్యము విష్ణుకథ సినిమా అతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ విజయంతో కిరణ్ కమర్షియల్ హీరోగా టాలీవుడ్ లో తనదైన శైలిలో ప్రూవ్ చేసుకున్నాడు. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన కిరణ్ నటించిన ఈ మూవీ ఓవరాల్‌గా రూ. 15 కోట్ల బిజినెస్ చేసింది.

ఊహించిన విజయమే అయినా.. మరీ ఈ రేంజ్ కలెక్షన్స్ ను ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. దీంతో కొత్త హీరోపై నమ్మకంతో ముందడుగు వేసిన నిర్మాతలు ఫైనల్ బిజినెస్ నంబర్స్ తో చాలా సంతోషంగా ఉన్నారు. తనపై ఎన్ని విమర్శలు వచ్చినా.. పట్టించుకోకుండా కెరీర్ పై కాన్ సెంట్రేట్ చేయడం వల్లే కిరణ్ కు ఈ విజయం సాధ్యమైంది. 4 కోట్ల థియేట్రికల్ టార్గెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ ఆ టార్గెట్ ను ఈజీగానే ఛేదించింది. ఓటిటి రైట్స్ 8 కోట్లకు, హిందీ డబ్బింగ్ రైట్స్ 5 కోట్లకు అమ్ముడు కావడం కిరణ్ ఎంచుకుంటోన్న కథల కెపాసిటీని తెలియజేస్తోంది. అలాగే ప్రతి సినిమాతోనూ తనను తాను మెరుగు పరుచుకోవడం వల్లే ఇంత పెద్ద సక్సెస్ సాధ్యం అయిందనుకోవచ్చు.

ఇక వినరో భాగ్యము విష్ణుకథ ఇచ్చిన కిక్ తో రాబోయే ‘మీటర్’సినిమా పై అంచనాలు పెరిగాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘మీటర్’ మూవీ కూడా వైవిధ్యమైన కాన్సెప్ట్ తో రూపొందిన సినిమా కావడం విశేషం. దీంతో ఈ మూవీపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. 10కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికే మంచి బిజెనెస్ చేసుకుని మైత్రీ మూవీస్ కు ఆల్రెడీ ప్రాఫిట్ వెంచర్ అనిపించుకుంది. మీటర్ కూడా పెద్ద విజయం సాధిస్తే.. కిరణ్ అబ్బవరం 20 కోట్ల మార్కెట్ హీరోగా మారతాడు. ఇంకాస్త ట్రై చేస్తే టైర్ టూ హీరోల రేంజ్ లోకి ఈజీగానే ఎంటర్ అవుతాడు అని చెప్పొచ్చు. మొత్తంగా కిరణ్ అబ్బవరం కమర్షియల్ హీరోగా నిలబడేందుకు వినరోభాగ్యము విష్ణు కథ విజయం చాలా దోహదం చేసింది.