‘మిస్టర్ కళ్యాణ్’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను : చందు మొండేటి.

శ్రీమతి ఉష శ్రీ సమర్పణలో శ్రీ దత్తాత్రేయ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించబడిన చిత్రం మిస్టర్ కళ్యాణ్. మార్చి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఫ్యామిలీ, లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో మాన్యం కృష్ణ, అర్చన, హీరో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాతో పండు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిర్మాత సుబ్బారెడ్డి ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా ఈ సినిమాను నిర్మించారు.

మిస్టర్ కళ్యాణ్ యూనిట్ కార్తికేయ 2 డైరెక్టర్ చందు మొండేటిని కలవడం జరిగింది.

దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ: మార్చి 10న విడుదల కాబోతున్న మిస్టర్ కళ్యాణ్ సినిమా విజయం సాధించాలి, అలాగే నిర్మాత ఎన్వీ సుబ్బారెడ్డి గారికి దర్శకుడు పండు కు ఇతర నటీనటులకు ఈ సినిమా మంచి పేరును తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకాదరణ పొందుతాయని అదే కోవలోని మిస్టర్ కళ్యాణ్ చేరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

అమ్మాయిలు మరియు మహిళలు తప్పకుండా ఈ సినిమా చూడాలి, ముఖ్యంగా వారికి కనెక్ట్ అయ్యే అనేక అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని చిత్ర యూనిట్ తెలిపింది.

సప్తగిరి, ధనరాజ్, తాగుబోతు రమేష్ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా చిత్రీకరణ వైజాగ్ మరియు హైదరాబాద్ ప్రాంతాల్లో జరిగింది. ఒక ప్రేత్యేక సాంగ్ కోసం లడక్ లోని అందమైన లొకేషన్స్ లో షూట్ చెయ్యడం జరిగింది.

నటీనటులు: మాన్యం కృష్ణ, అర్చన, రాజ్ వర, సప్తగిరి, తాగుబోతు రమేష్, ధనరాజ్ తదితరులు.

సాంకేతిక నిపుణులు:
డైరెక్టర్: పండు
నిర్మాత: సుబ్బారెడ్డి
సంగీతం: సుక్కు
సినిమాటోగ్రఫీ: నానాజీ. ఎంవి.గోపి
ఎడిటర్: వినోద్ అద్వయ్
డాన్స్: అనీష్
ఫైట్స్: మల్లేష్
పీఆర్ఒ: శ్రీధర్