నా వ్యాధికి ఖర్చు పెట్టుకునే స్థోమత ఉంది : సమంత

టాలీవుడ్‌ స్టార్‌ నటి సమంత ఇటీవలే తరచూ వార్తల్లో నిలుస్తోంది. సామ్‌ గత కొన్ని రోజులుగా మయోసైటిస్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వ్యాధి నుంచి పూర్తిగా కోలుకునేందుకు అమెరికాలో ట్రీట్‌ మెంట్‌ తీసుకోనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ఏడాది పాటు సినిమాలకు బ్రేక్‌ కూడా ఇచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా సమంతకు.. మయోసైటిస్‌ చికిత్స కోసం ఓ టాలీవుడ్‌ స్టార్‌ హీరో రూ.25 కోట్లు సాయం చేశారంటూ టాక్‌ వినిపిస్తోంది. ఈ మేరకు సోషల్‌ విూడియా.. పలు ఆంగ్ల విూడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఈ వార్తలపై తాజాగా సమంత స్పందించారు.

అందులో ఏ మాత్రం నిజం లేదని స్పస్టం చేశారు. చికిత్స కోసం వేరే వాళ్ల నుంచి సాయం పొందాల్సిన అవసరం తనకు లేదన్నారు. మయోసైటిస్‌ చికిత్స కోసం రూ.25 కోట్లా..!? ఎవరో విూకు తప్పుడు సమాచారం అందించారు. విూరు చెప్పిన దానిలో అతి తక్కువ మొత్తాన్ని మాత్రమే ఖర్చు చేస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నా కెరీర్‌ లో ఇప్పటి వరకూ నేను చేసిన పనికి జీతంగా రాళ్లు ఇవ్వలేదని అనుకుంటున్నాను. కాబట్టి, నన్ను నేను జాగ్రత్తగా చూసుకోగలను. ధన్యవాదాలు. మయోసైటిస్‌ కారణంగా వేలాది మంది బాధపడుతున్నారు. ట్రీట్‌ మెంట్‌ కు సంబంధించిన సమాచారాన్ని అందించే ముందు దయచేసి కాస్త బాధ్యత వహించండి’ అంటూ ఇన్‌ స్టా స్టోరీస్‌ లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది.