వరద బాధితులకు తన వంతు గా సహాయం అందించిన డైరెక్టర్ తల్లాడ సాయికృష్ణ

గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయిన పరిస్థితి విదితమే. అందులో భాగంగా చాలా మంది సెలబ్రిటీలు తమ బాధ్యత గా తమ వంతుగా వారికి తోచిన రూపంలో సహాయం అందించడం మొదలు పెట్టారు, అందులో భాగంగా యువ దర్శకుడు నటుడు తల్లాడ సాయికృష్ణ తమ వంతుగా లక్ష యాభై వేలు ( 1.50 lacks) ని ఖమ్మం, మహబూబాద్ జిల్లా కి ప్రకటించడమే కాకుండా వారి స్నేహితులు సైతం వర్షం వలన ఇబ్బంది పడిన కుటుంబాలకి ఆహారం, నిత్యావసర వస్తువులు పంచుతూ సాటి మనుషులు గా మానవత్వం చాటుకుంటూ స్నేహానికి తోడుగా నిలిచారు.

తల్లాడ సాయికృష్ణ మరియు వారి స్నేహితులు చేసిన కార్యక్రమం చిన్నదేనా కొంతమందికి అసార గా ఉంది అని చాలా మంది సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలుపుతున్నారు.