జూలై 7న విడుదలవుతున్న దర్శకుడు నీలకంఠ “సర్కిల్”

వైవిధ్యమైన చిత్రాల రూపకర్తగా పేరున్న దర్శకుడు నీలకంఠ కొంత విరామం తర్వాత రూపొందించిన సినిమా “సర్కిల్”. ఈ చిత్రంలో సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్‌ మెహతా,రిచా పనై కీలక పాత్రల్లో నటించారు. ఆరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎమ్.వి శరత్ చంద్ర, టి సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ నిర్మించారు. సరికొత్త థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూలై 7న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించారు.

ఒక ఫొటోగ్రాఫర్ జీవితం చుట్టూ అల్లుకున్న కథతో “సర్కిల్” సినిమా తెరకెక్కింది. తన జీవితంలో శత్రువులెవరో, మిత్రులెవరో తెలియని సందిగ్ధంలో కథానాయకుడు ఏం చేశాడనేది ఆసక్తికరంగా చూపించబోతున్నారు దర్శకుడు నీలకంఠ. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పాటలు, టీజర్ కు మంచి స్పందన వస్తోంది. సినిమా కూడా ప్రేక్షకాదరణ పొందుతుందని చిత్రబృందం నమ్మకంగా చెబుతున్నారు.

సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్‌ మెహతా,రిచా పనై, నైనా , పార్థవ సత్య తదితరులు ఇతర పాత్రల్లో నటించిన

ఈ చిత్రానికి సినిమాటోగ్రపీ : రంగనాథ్ గోగినేని, ఎడిటర్ : మధు రెడ్డి, సంగీతం : ఎన్.ఎస్ ప్రశు, నిర్మాతలు : ఎమ్.వి శరత్ చంద్ర, టి సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ, రచన, దర్శకత్వం : నీలకంఠ, పీఆర్వో – జీఎస్కే మీడియా