డిఫరెంట్‌ రివెంజ్‌ స్టోరీ..టిల్లూ స్క్వేర్‌!

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్నాడు, చిత్రానికి ముందు కొన్ని సినిమాలు చేసినా పెద్దగా క్లిక్‌ అవ్వలేదు. దీంతో రూట్‌ మార్చిన సిద్ధుకు.. డీజే టిల్లు మూవీతో బ్రేక్‌ లభించింది. దీంతో యూత్‌లో ఊహించని క్రేజ్‌ సంపాదించాడు. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతోనే ఇప్పుడు ’టిల్లు స్క్వేర్‌’పేరుతో సీక్వెల్‌ చేస్తూ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ కూడా పక్కా హిట్‌ అవుతుందన్న నమ్మకంతో ఉన్నాడు.

ఈ మూవీ సెప్టెంబర్‌ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, మొదటి పార్ట్‌ లో హీరోయిన్‌ ని చివరిలో హీరో ట్విస్ట్‌ ఇస్తాడు. మొదట హీరోయిన్‌ చేసిన నేరం, హీరో విూద పడేలా చేస్తుంది. కానీ, హీరో చాలా తెలివిగా దాని నుంచి తప్పించుకొని, చివర్లో ఆమె నేరం చేసినట్లు నిరూపిస్తాడు. ఇప్పుడు ఈ రెండో పార్ట్‌ లో దానికి హీరోయిన్‌ రివేంజ్‌ తీర్చుకుంటుందట. అదేంటి? రెండో భాగంలో నేహా శెట్టి లేదు కదా? అనుపమను హీరోయిన్‌ గా తీసుకున్నారు కదా అనే సందేహం విూకు కలగొచ్చు. అనుపమనే హీరోయిన్‌ కానీ, మూవీ చివరలో నేహా పాత్ర ఉంటుందట. ఆ సమయలో ఆమె టిల్లూకి ఇచ్చే ట్విస్ట్‌ మూవీకే హైలెట్‌ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇదే నిజం అయితే, ఈ విషయం ఫ్యాన్స్‌ కి మంచి కిక్‌ ఇచ్చే అవకాశం ఉంది.

ఇక, మొదటి భాగం లో సిద్దు జొన్నల గడ్డ చెప్పిన డైలాగుల తో పాటు, నేహా శెట్టి అందాలు సినిమాకి హైలెట్‌ గా నిలిచాయి. మూవీ విజయం సాధించడానికే ఇవే కారణం. మరి రెండో భాగంలో ఆ మ్యాజిక్‌ వర్కౌట్‌ అవుతుందో లేదో చూడాలి. ఇక, ఈ మూవీ కోసం ఫ్యాన్స్‌ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈ మూవీ ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, పలు కారణాల వల్ల ఈ మూవీ వాయిదా పడుతూ వచ్చింది. ్గªనైల్‌ గా వినాయకచవితి సమయంలో ఈ మూవీ విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు. మరి మొదటి భాగంలాగానే, రెండో పార్ట్‌ కూడా క్లిక్‌ అవుతుందో లేదో చూడాలి.