ఆకట్టుకుంటోన్న ధృవ్ సర్జా ‘మార్టిన్’ ట్రైలర్.. మైత్రీ మూవీస్ ద్వారా నైజాంలో అక్టోబర్ 11న విడుదల

ధృవ స‌ర్జా టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘మార్టిన్’. ఎ.పి.అర్జున్ ద‌ర్శ‌క‌త్వంలో వాస‌వీ ఎంట‌ర్‌ప్రైజెస్‌, ఉద‌య్ కె.మెహ‌తా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై ఉద‌య్ కె.మెహ‌తా, సూర‌జ్ ఉద‌య్ మెహ‌తా ఈ భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ను నిర్మించారు. రీసెంట్‌గా విడుద‌లైన మూవీ ట్రైల‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ ట్రైలర్ చూస్తుంటే ఇండియన్ స్క్రీన్‌పై ఇది వరకెన్నడూ చూడని యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా మార్టిన్ నిలిచేలా ఉంది. ఈ ట్రైలర్‌లో ధృవ్ సర్జా లుక్స్, యాక్షణ్ సీక్వెన్స్, చివర్లో చెప్పిన డైలాగ్ అన్నీ కూడా గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి.

ముంబైలో ధృవ స‌ర్జా హీరోగా న‌టించిన‌ భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘మార్టిన్’ ట్రైలర్ రిలీజ్

ప్ర‌ముఖ న‌టుడు, ద‌ర్శ‌కుడు అయిన యాక్ష‌న్ కింగ్ అర్జున్ ఈ చిత్రానికి క‌థ‌ను అందించ‌టం విశేషం. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ పాట‌ల‌కు సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేష‌న్ ర‌వి బ‌స్రూర్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించారు. ఈ ట్రైలర్‌లో ఆర్ఆర్‌ను వింటే.. రవి బస్రూర్ ఈ చిత్రాన్ని మరో స్థాయిలో నిలబెట్టేస్తాడని అర్థం అవుతోంది. సత్య హెగ్డే విజువల్స్ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఉన్నాయి. అక్టోబర్ 11న ఈ చిత్రం మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి ద్వారా నైజాంలో.. ఏపీ, సీడెడ్‌లో ఎంఎస్ ఫిల్మ్స్ ద్వారా రిలీజ్ కానుంది.

ధృవ స‌ర్జా ‘మార్టిన్’ నుంచి ‘అదంతేలే..’ సాంగ్ రిలీజ్.. ఆక‌ట్టుకుంటోన్న ల‌వ్ మెలోడీ