చేతన్ చేను “భీష్మ పర్వం” గ్రాండ్ గా ప్రారంభం

రాజు గారి గది, మంత్రా 2, విద్యార్ధి, జెంటిల్మెన్ 2 ఫేమ్ చేతన్ చేను కథానాయకుడిగా నూతన దర్శకుడు ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం”భీష్మ పర్వం”. ప్రేమ్ కుమార్, చేతన్ చేను నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కారక్ర్యమం ఈ రోజు గ్రాండ్ గా నిర్వహించారు.

ఈ పూజ కార్యక్రమానికి బెక్కం వేణుగోపాల్ అతిధిగా హాజరయ్యి ముహూర్తపు స‌న్నివేశానికి క్లాప్ కొట్టారు. ఎర్రవెల్లి భాస్కర్, ఎర్రవెల్లి ప్రవీణ్, తరణి భాస్కర్, జయశంకర్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు.

పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం రామోజీ ఫిలిం సిటీ దగ్గర్లో 40 అడుగుల కాళీ మాత సెట్ వేసి వంద మంది ఫైటర్లతో భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

పీఎంకే ఇంటెర్నేషనల్స్ , చేతన్ చేను ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రోషిని సహోతా కథానాయిక. అనూప్ శర్మ విలన్ గా నటిస్తున్నారు.

తారాగణం: చేతన్ చేను, రోషిని సహోతా , అనూప్ శర్మ

టెక్నికల్ టీమ్ :
దర్శకత్వం : ప్రేమ్ కుమార్
నిర్మాత‌లు: ప్రేమ్ కుమార్, చేతన్ చేను
బ్యానర్స్: పీఎంకే ఇంటెర్నేషనల్స్ , చేతన్ చేను ప్రొడక్షన్స్
సంగీతం: విష్ణు విహారి
డీఓపీ: ఈశ్వర్ ఆదిత్య
ఎడిట‌ర్: అమర్ రెడ్డి
లిరిక్స్: అనిరుద్
ఆర్ట్: ఆనంద్
స్టoట్స్: జాషువా మాస్టర్
పీఆర్వో: వంశీ శేఖర్