అంగరంగ వైభవంగా నటుడు త్రిగుణ్ నివేదితల వివాహం.

కథ అనే సనిమాతో సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన త్రిగుణ్ పీవీఎస్ గరుడ వేగ, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, డీయర్ మేఘలాంటి చిత్రాల్లో నటించారు. అలాగే ఆర్జీవి తెరకెక్కించిన కొండా చిత్రంతో మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు తెలుగు ప్రేక్షకులందరికి చాలా దగ్గరయ్యారు. ప్రస్తుతం ఈ నటుడు ఒక ఇంటివాడు అయ్యాడు.

ఈరోజు ఉదయం 5.45 గంటలకు తమిళనాడు తిరుపుర్ లో వేదమంత్రల సాక్షిగా కుటుంబం, బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభంగా వధువు నివేదిత మెడలో తాళి కట్టారు. సినిమా ప్రముఖులు, రాజకీయా నాయకులు హాజరై ఈ నవ దంపతులను ఆశీర్వదించారు.

నటుడు త్రిగుణ్ ప్రస్తుతం తెలుగు, తమిళ్ లో పలు చిత్రాల్లో నటిస్తున్నారు.