బాలీవుడ్‌ సినిమాలకు బన్నీనో !?

అల వైకుంఠపురంతో రికార్డు సృష్టించి.. పుష్పతో ఏకంగా పాన్‌ ఇండియా స్థాయిలో రికార్డులు కొల్లగొట్టి తిరుగులేని స్టార్‌గా ఎదిగాడు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. ఇప్పుడు ఆయన సినిమా కోసం యావత్‌ సినీ లవర్స్‌ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. రెండేళ్ల కిందట విడుదలైన పుష్ప సినిమా బాక్సాఫీస్‌ దగ్గర సృష్టించిన సంచలనాలు అంతా ఇంతా కాదు. ఎలాంటి ప్రమోషన్‌లు లేకుండానే హిందీ బెల్ట్‌పై వంద కోట్ల బొమ్మతో నార్త్‌ ఆడియెన్స్‌తో జైజైలు కొట్టించుకున్నాడు. ప్రస్తుతం బన్నీ ’పుష్ప`2’తో బిజీగా ఉన్నాడు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత బన్నీ, త్రివిక్రమ్‌తో చేతులు కలుపుతున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌ విూదకు వెళ్లే చాన్స్‌ ఉంది.

ఇక ఇదిలా ఉంటే తాజాగా బన్నీ ఓ బాలీవుడ్‌ దర్శకుడికి నో చెప్పినట్లు తెలుస్తుంది. నాలుగేళ్ల కిందట వచ్చిన ఉరి: ది సర్జికల్‌ స్టయ్రిక్‌ సినిమాతో దేశమంతటిని తనవైపు తిప్పుకునేలా చేశాడు దర్శకుడు ఆదిత్య ధార్‌. ఉరి సినిమాను తెరకెక్కించిన విధానానని సినీ లవర్స్‌ ఫిదా అయ్యారు. ఆయన టేకింగ్‌, విజన్‌కు హర్షధ్వానాలు వెల్లువెత్తాయి. అలాంటి దర్శకుడి నుంచి ఇప్పటి వరకు మరో సినిమా రాలేదు. తనకు స్టార్‌ డైరెక్టర్‌ ట్యాగ్‌ తెచ్చిపెట్టిన విక్కీ కౌశల్‌తోనే మరో సినిమాను ఎª`లాన్‌ చేశాడు. దానికి ది ఇమ్మోర్టల్‌ అశ్వథ్థామ అనే పేరును కూడా ఫిక్స్‌ చేసి ప్రీలుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశాడు. కారణం ఏంటో తెలియదు కానీ విక్కీ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత రణ్‌వీర్‌ సింగ్‌ను సంప్రదించగా.. ఆయన నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ రాలేదు. కాగా తాజాగా ఆ దర్శకుడు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ను సంప్రదించినట్లు తెలుస్తుంది.

బన్నీకి కథ బాగా నచ్చిందట. కానీ సినిమా చేయడానికి వెనకా ముందు ఆలోచిస్తున్నాడట. పుష్ప సినిమాలో రగ్గుడ్‌ లుక్‌లో చూసిన జనాలకు.. అశ్వథ్థామ అనే ఇతిహాసం కథలో తన పాత్ర రిజస్టర్‌ అవుతుందా అనే మిలియన్ల డాలర్ల ప్రశ్నతో నో చెప్పాడని టాక్‌. పైగా సినిమాలో ఎక్కువ భాగం వీఎఫ్‌ఎక్స్‌పైనే ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సగానికి పైగా వీఎఫ్‌ఎక్స్‌పై బేస్‌ ఉన్న సినిమాలో నటించడం కాస్త రిస్క్‌ అని భావించాడట. ఇదే విషయాన్ని మేకర్స్‌కు కూడా చెప్పేశాడట.