జూన్ 3న జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌ లో శర్వానంద్‌ వివాహం

హీరో శర్వానంద్‌, రక్షితా ల వివాహం రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరగనుంది. వివాహ ఆహ్వానం వెలువడింది. ఈ వివాహ వేడుక రెండు రోజులు పాటు వైభవంగా జరగనుంది. మెహందీ ఫంక్షన్ జూన్ 2 న జరుగుతుంది. మరుసటి రోజు పెళ్లి కొడుకు ఫంక్షన్ జరుగుతుంది.

అదే రోజు జూన్3న జైపుర్‌లోని లీలా ప్యాలెస్‌ లో శర్వానంద్‌, రక్షితా ల వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. వివాహ వేడుక రాత్రి 11 నుండి ప్రారంభమవుతుంది.

శర్వానంద్‌, రక్షితా ల నిశ్చితార్థం జనవరిలో జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన వేడుకలో ఇరు కుటుంబసభ్యులు, ప్రముఖుల సమక్షంలో వీళ్లిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు.

ప్రీవెడ్డింగ్, వెడ్డింగ్ వేడుకలు అంగరంగవైభవంగా కన్నులపండగగా జరగనున్నాయి.