‘7/జీ’ పార్ట్ 2 వచ్చే నెల నుంచి మొదలౌతుంది: ఏ.ఎం.రత్నం

ప్రముఖ నిర్మాత ఏయం రత్నం నిర్మాణంలో, క్రియేటివ్ డైరెక్టర్ సెల్వ రాఘవన్‌ వెండితెరపై ఆవిష్కరించిన ఆల్ టైమ్ కల్ట్ క్లాసిక్ ‘7/జీ బృందావన్‌ కాలనీ’. రవికృష్ణ, సోనియా అగర్వాల్‌ జంటగా నటించిన ఈ చిత్రం ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ గా సంచలన సాధించి ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది. ఇప్పుడు ఈ సినిమా మరోసారి ప్రేక్షకులని అలరింబోతుంది. నిర్మాతలు ఉదయ్, యతి ఏయు సినిమాస్ & వివై ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా సెప్టెంబర్ 22న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రీరిలీజ్ ట్రైలర్ ని లాంచ్ చేసిన మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రెస్ మీట్ లో నిర్మాత ఏయం రత్నం మాట్లాడుతూ.. నేను చేసిన ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ‘7/జీ బృందావన్‌ కాలనీ’ కల్ట్ మూవీ. ఈ సినిమాకి చాలా మంచి పేరు వచ్చింది. తెలుగు తమిళ్ రెండూ భాషల్లో పెద్ద విజయం సాధించింది. ఇదొక పోయిటిక్ సినిమా. సినిమా ప్రారంభం ముగింపు పొయిటిక్ గా వుంటాయి. ఉదయ, యతి చాలా శ్రద్ధ తీసుకొని ఈ సినిమాని రిరిలీజ్ చేస్తున్నారు. రీరిలీజ్ లో కూడా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని నమ్మకం వుంది. రవితో మళ్ళీ రీఎంట్రీలా ‘7/జీ బృందావన్‌ కాలనీ’ పార్ట్ 2 ని వచ్చే నెల నుంచి మొదలుపెడుతున్నాం. సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తారు. స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చింది.’’ అన్నారు.

రవికృష్ణ మాట్లాడుతూ.. ట్రైలర్ చూసిన తర్వాత మళ్ళీ రవి పాత్రలోకి వెళ్ళిపోయాను ( నవ్వుతూ) చాలా రోజులు గా రీరిలీజ్ చేయాలనీ నాన్న గారు అనుకున్నారు. సెకండ్ పార్ట్ ని కూడా ప్లాన్ చేస్తున్నాం. పార్ట్ 2కి ముందు మరోసారి 7/జీ మ్యాజిక్ చూపించేలా చిత్రం రీరిలీజ్ జరుగుతోంది. అందరూ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు.

సోనియా అగర్వాల్‌ మాట్లాడుతూ.. ‘7/జీ బృందావన్‌ కాలనీ’ చిత్రాన్ని మరోసారి బిగ్ స్క్రీన్ పై చూసే అవకాశం రావడం నిజంగా చాలా ఆనందంగా వుంది. మీ అందరి ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. అందరూ తప్పకుండా ఈ సినిమా థియేటర్స్ లో చూడండి’’ అని కోరారు.

ఉదయ్ మాట్లాడుతూ.. మాకు ఈ అవకాశం ఇచ్చిన రత్నం గారికి కృతజ్ఞతలు. రీరిలీజ్ ప్రింట్ అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. తప్పకుండా మీరంతా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. ఈ ప్రెస్ మీట్ లో సుమన్ శెట్టితో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.