Thalapathy Mark Politics: తమిళ రాజకీయ తెరపై ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) అధినేత, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సంచలనం సృష్టించారు. సాధారణంగా రాజకీయాల్లో వారసత్వానికి, ధనబలానికి పెద్దపీట వేసే సంస్కృతికి భిన్నంగా.. తనను నమ్ముకున్న సామాన్యుడికి పట్టం కట్టారు. గత 30 ఏళ్లుగా తన వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న రాజేంద్రన్ పట్ల కృతజ్ఞత చాటుతూ, ఆయన కుమారుడు శబరినాథన్ను అసెంబ్లీ బరిలో నిలబెట్టారు.
విరుగంపాక్కం అభ్యర్థిగా శబరినాథన్ రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం చెన్నైలోని విరుగంపాక్కం నియోజకవర్గం నుంచి శబరినాథన్ను తమ పార్టీ అభ్యర్థిగా విజయ్ అధికారికంగా ప్రకటించారు. కేవలం సినిమా హీరోగానే కాకుండా, నిజ జీవితంలోనూ ‘నాయకుడు’ అనిపించుకునేలా విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చదువుకున్న యువతకు, సామాన్య కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పిన మాటను విజయ్ నిలబెట్టుకున్నారు.
நெகிழ்ச்சியான தருணம்: நடிகர் விஜய் அண்ணாவின் ஓட்டுநர் ‘ராஜேந்திரன்’ மற்றும் அவரது மகன் #Sabrinathan! 🥹🫂#தமிழகவெற்றிக்கழகம்#TVKVijay pic.twitter.com/RMMLwC6FAu
— Arun P (@Arun_p_offcial) March 29, 2026
వేదికపై భావోద్వేగ క్షణాలు అభ్యర్థిగా శబరినాథన్ పేరును ప్రకటిస్తున్న సమయంలో సభా ప్రాంగణంలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. తన యజమాని ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పిస్తారని ఊహించని డ్రైవర్ రాజేంద్రన్, ఆయన కుమారుడు శబరినాథన్ కన్నీటి పర్యంతమయ్యారు. విజయ్ వారిని దగ్గరకు తీసుకుని అభినందించడం అక్కడి వారందరినీ కదిలించింది.
సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియా వేదికగా విజయ్ అభిమానులు, రాజకీయ విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. “ఇది కదా అసలైన మార్పు అంటే!”, “సామాన్యుడికి చట్టసభల్లో చోటు కల్పించే గొప్ప మనసు” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా దూసుకుపోతున్న టీవీకే పార్టీకి ఈ నిర్ణయం పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని భావిస్తున్నారు.

