Harnaaz Sandhu: మిస్ యూనివర్స్ కి మోదీ శుభాకాంక్షలు

Harnaaz Sandhu: ఎన్నో సంవత్సరాల నీరీక్షణకి తెరదించుతూ మిస్ యూనివర్స్ కిరీటం సొంతం చేసుకొని చరిత్ర సృష్టించిన భారత యువతీ హర్నాజ్ సంధుకి ప్రధానమంత్రి మోదీ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘మిస్ యూనివర్స్ కిరీటం సాధించినందుకు హర్నాజ్ సంధుకి అభినందనలు. ఆమెకి మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని మోదీ ట్వీట్ చేశారు.

ఈ అందాల పోటీల్లో 80 దేశాల అందగత్తెలు పోటీపడ్డారు. 21 ఏళ్ళ నీరీక్షణకి ముంగిపు చెబుతూ మిస్ యూనివర్స్ 2021 పోటీల్లో హర్నాజ్ సంధు విజేతగా నిలిచింది. ఈరోజు ఇజ్రాయెల్‌లోని ఐలాట్‌లో జరిగిన 70వ మిస్ యూనివర్స్ 2021లో భారత్ నుండి ప్రాతినిధ్యం వహించింది హర్నాజ్ సంధు. ‘లారా దత్తా’ 2000లో టైటిల్‌ను గెలుచుకున్న 21 ఏళ్ల తర్వాత సంధు ఈ ఘనత సాధించింది. మొత్తంగా చూసుకుంటే ఇప్పటివరకు సుస్మితాసేన్ (1994) తో కలిపి భారత్ నుండి ముగ్గురు మాత్రమే విశ్వ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు.