హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో తీర్పిచ్చిన కోర్టు

హైదరాబాద్ లో జరిగిన జంట పేలుళ్ల కేసులో నాంపల్లి మెట్రో పాలిటన్ సెషన్స్ కోర్టు జడ్జి తీర్పును వెలువరించారు. ఇద్దరు నిందితులను దోషులుగా తేల్చుతూ కోర్టు తీర్పునిచ్చింది. ఏ1 నిందితుడు అక్బర్ ఇస్మాయిల్ , ఏ2 నిందితుడు అనిక్ షఫీక్ సయ్యద్ లను కోర్టు దోషులుగా తేల్చింది. వీరికి సోమవారం శిక్షలు ఖరారు కానున్నాయి . ఆధారాలు లేవంటూ మరో ఇద్దరిపై కేసు కొట్టేసింది. చర్లపల్లిలోని ఎన్ ఐఏ సెషన్స్ కోర్టులో తీర్పును వెలువరించారు.

12 ఏండ్ల తర్వాత ఈ కేసులో నాంపల్లి రెండో మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది. 2007 ఆగష్టు 25న సాయంత్రం గోకుల్ చాట్, లుంబీనీ పార్క్ పేలుళ్లలో మొత్తం 44 మంది చనిపోగా 68 మంది గాయపడ్డారు. పేలుళ్లలో 7 మహారాష్ట్ర ఇంజనీరింగ్ విద్యార్దులు చనిపోయారు. పేలుడు జరిగిన ప్రాంతమంతా రక్త సిక్తంతో మారిన సంఘటన ఇప్పటికి కూడా ప్రజలు మర్చిపోలేకపోతున్నారు.

లుంబీనీ పార్క్

 ఇండియన్ ముజాహీద్దీన్  సంస్థ పేలుళ్లకు పాల్పడిన మొదటి సంఘటన ఇదే. రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్, అమీరజాఖాన్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, అనీక్ షఫీక్ సయ్యద్, ఫారూక్ షర్పూద్దీన్ తర్కాష్, మహ్మద్ సాధిక్ ఇస్రార్ అహ్మద్, తారీఖ్ అంజూమ్ ఈ కుట్రకు పాల్పడినట్టు దర్యాప్తు సంస్థలు తేల్చాయి. రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ అమీరజాఖాన్ పరారీలో ఉన్నారు. మిగతా వారిని పోలీసులు అరెస్టు చేశారు.

12 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు వెలువడడంతో పోలీసులు కట్టు దిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సోమవారం నాడు నిందితులకు శిక్ష ఖరారు చేయనున్నారు