మాయావ‌తి హిజ్రాల కంటే హీనం: బీజేపీ ఎమ్మెల్యే!

బ‌హుజ‌న స‌మాజ్‌వాది పార్టీ అధినేత్రి మాయావ‌తిని హిజ్రాల‌తో పోల్చారు ఓ బీజేపీ మహిళా ఎమ్మెల్యే. మాయావ‌తి కంటే హిజ్రాలే బెట‌ర్ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. `మాయావ‌తి మ‌హిళ కాదు, అలాగ‌ని పురుషుడూ కాదు. ఆమె కంటే హిజ్రాలే న‌యం..` అని బ‌హిరంగంగా విమ‌ర్శించారు.

ఆ మ‌హిళా ఎమ్మెల్యే పేరు సాధ‌నా సింగ్‌. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌ చందౌలి జిల్లాలోని మొఘ‌ల్‌స‌రాయ్‌ నియోజ‌క‌వ‌ర్గానికి ఆమె ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. 2017 ఎన్నిక‌ల్లో ఆమె అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటైన ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన సాధ‌నా సింగ్ మాయావ‌తిపై ధ్వ‌జ‌మెత్తారు. వ‌స్త్రాప‌హ‌ర‌ణకు గురైన ఏ మ‌హిళ కూడా అధికారం కోసం వెంప‌ర్లాడ‌ర‌ని అన్నారు.

`ఓ మ‌హిళ ధ‌రించిన ర‌వికె, పెట్టికోట్‌, చీరె చిరిగిపోతాయో..అలాంటి మ‌హిళ అధికారంలోకి రావ‌డానికి ప్ర‌య‌త్నించ‌కూడ‌దు. అలా జ‌రిగితే-మొత్తం దేశానికే అది అవ‌మాన‌క‌రం, మాయ‌ని మ‌చ్చ‌. అలాంటి మ‌హిళ హిజ్రాల కంటే హీనం. ఎందుకంటే- స‌ర్వం కోల్పోయిన మ‌హిళ మ‌హిళ అనిపించుకోదు, పురుషుడూ కాడు..` అని ఆరోపించారు.

కోల్‌క‌త‌లో మ‌మ‌తా బెన‌ర్జీ ఏర్పాటు చేసిన యునైటెడ్ ఇండియా ర్యాలీకి మాయావ‌తి గైర్హాజ‌ర‌య్యారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సాధ‌నాసింగ్ ఇలా ఘాటు వ్యాఖ్యానాలు చేశార‌ని చెబుతున్నారు.