బిగ్ న్యూస్ : ఎన్టీఆర్ తో అమిత్ షా కీలక మీటింగ్..ఎందుకో తెలుసా.!

లేటెస్ట్ గా సెన్సేషనల్ న్యూస్ ఇప్పుడు బయటకి వచ్చింది. దేశ వ్యాప్తంగా కూడా ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. మరి ఈ ఇండియన్ సినిమా దగ్గర భారీ వసూళ్లు అందుకొని అదరగొట్టిన చిత్రం ట్రిపుల్ ఆర్(RRR). దర్శక ధీరుడు రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో చేసిన ఈ సినిమా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా అదరగొడుతుంది.

ఇప్పటికీ కూడా ఎక్కడో ఒక దగ్గర నుంచి ఆడియెన్స్ అలా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఇలా ఈ చిత్రం భారీ స్పందన అందుకుంటుండగా ఇప్పుడు ఈ సినిమా హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మీట్ అవుతున్నారని ఒక సంచలన వార్త పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.

ఈరోజు సాయంత్రం షా ఎన్టీఆర్ ని ఢిల్లీ లో మీట్ అవ్వనున్నారట. అంతే కాకుండా ఎందుకంటే తాను రీసెంట్ గా ఈ RRR సినిమా చూడగా దీనిలో ఎన్టీఆర్ నటన చూసి అమితంగా ఇంప్రెస్ అయ్యారట. అందుకే ప్రత్యేకంగా ఎన్టీఆర్ ని డిన్నర్ కి ఆహ్వానించినట్టుగా ఇప్పుడు కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. దీనితో ఈ సంచలన వార్త ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. అయితే ఈ మీటింగ్ ఇందుకోసమేనా లేక వేరే కారణం కూడా ఉందా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.