ఆసియా క్రీడల్లో భారత్ బోణి

ఏషియన్ గేమ్స్ -2018లో భారత్ బోణి కొట్టింది. 18వ ఏషియన్ ఏషియాడ్ లో భారత్ కాంస్యంతో పతకాల వేటను ప్రారంభించింది. తొలిరోజు ఈవెంట్ లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్ డ్ టీమ్ విభాగంలో రవికుమార్, అపూర్వీ చండేలా కాంస్య పతకం సాధించి భారత్ కు శుభారంభాన్ని అందించారు.

ఫైనల్లో 429.9 స్కోర్ సాధించి మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. 494.1 స్కోర్ తో చైనీస్ తైపీ తొలి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించగా… 492.5 స్కోర్ తో చైనా రజతం దక్కించుకుంది. ఇక 10 మీటర్ల మిక్స్ డ్ ఎయిర్ పిస్టోల్ విభాగంలో మనూభాస్కర్, అభిషేక్ వర్మలు ఫైనల్ కు అర్హత సాధించడంలో విఫలమయ్యారు.