ప్రయాగ్ రాజ్ గా మారిన అలహాబాద్

ఉత్తర  ప్రదేశ్ లోని అలహాబాద్ నగరం పేరు మార్చారు.  ఈరోజు నుంచి ఈ నగరం పేరు ప్రయాగ్ రాజ్. ఈ మేరకు ముఖ్యమంత్రి అదిత్యనాథ్ యోగి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.క్యాబినెట్ సమావేశం అనంతరం  ఈ విషయాన్ని సిద్ధార్థనాధ్ సింగ్ ప్రకటించారు. కుంభమేలా ముందు  ఈ పేరు మార్పిడి జరిగింది.

శనివారం నాడు అలహాబాద్ సందర్శించినపుడు ముఖ్యమంత్రి అదిత్యనాథ్ పేరు మార్పిడి ప్రతిపాదన గురించి చెప్పారు. 2019 కుంభమేలా కుముందే అలహాబాద్ ప్రయాగ్ రాజ్ అవుతుందని చెప్పారు. అయితే, రెండురోజులలోనే క్యా బినెట్ ఈ ప్రతిపాదనకు ఈ రోజు ఆమోదం తెలిపింది.