Yash and bunny : కన్నడ గడ్డపై బన్నీకి జరిగింది…తెలుగు గడ్డపై యష్ కు జరిగిందా…!

Yash and bunny : కర్ణాటకలో జరిగిన సీన్ ఆంధ్రాలో రిపీట్ అయింది. బన్నీ అభిమానులకు ఏదో కొంచెం సంతృప్తి కలిగింది. విషయానికోస్తే అల్లు అర్జున్ పుష్ప సినిమా ప్రచార కార్యక్రమాల కోసం బెంగళూరు వెళ్లారు. ఇక అక్కడ ఆయన 11:30కి రావాల్సి ఉండగా మేసినా మీటింగ్ కు 1:30 కు హాజరయ్యారు. 2 గంటలు ఆలస్యం అవడంతో కన్నడ మీడియా ఆయనను నిలదీసింది. దీంతో బన్నీ మీడియా కు క్షమాపణలు చెప్పారు. ఇక ఈ చేదు అనుభవం బన్నీ అభిమానులను హర్ట్ చేసే ఉంటుంది.

#Yash
ఇక ఇపుడు అదే సంఘటన రిపీట్ అయింది అదికూడా ఆంధ్రాలో ని విశాఖలో అయితే ఇది తెలుగు హీరోకు కాదు కన్నడ హీరోయిన్ యష్ కి జరిగింది. యష్ నటించిన కెజిఎఫ్ ఇంత పెద్ద హిట్టో అందరికి తెలుసు. ఇక పాన్ ఇండియా లెవెల్ లో యష్ కి మాంచి క్రేజ్ ఉంది. ఇక రెండూ తెలుగు రాష్ట్రాల్లో కూడా రాకీ భాయ్ ఫాలోయింగ్ మాములుగా లేదు. కేజీఎఫ్ తో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు యష్.

ఇక యష్ నటించిన తాజా చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2 ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇక ప్రమోషన్స్ లో భాగంగా యష్ విశాఖ వచ్చారు. సింహాద్రి అప్పన్న దర్శనం తర్వాత మీడియాతో మీటింగ్ ఏర్పాటు చేసారు చిత్ర యూనిట్.ఇతను కూడా గంటన్నర లేటుగా హాజరయ్యాడట. దీంతో యష్ ను ఈ విషయమై ప్రశ్నించింది మన టాలీవుడ్ మీడియా. దానికి యష్ వెంటనే అందరికీ క్షమాపణలు తెలిపాడట. ఇక ఈ విషయం ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.