నాగబాబు..వర్మల మధ్య పోస్టుల యుద్దం…

మెగా బ్రదర్‌ నాగబాబు, రామ్‌ గోపాల్‌ వర్మల మధ్య మరోసారి మాటల యుద్ధం ముదురుతోంది. రీసెంట్‌గా వర్మ ఓ ఛానల్‌లో తనని టార్గెట్ చేస్తూ ప్రసారాలు చేశారని.. అందుకు సంబంధించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నాగబాబు సోషల్‌ విూడియా వేదికగా వ్యంగ్యంగా స్పందించారు.

నాగబాబు చేసిన పోస్ట్‌కు వర్మ కూడా అదే విధంగా ఎక్స్‌ వేదికగా రియాక్ట్‌ అయ్యారు. వర్మ రిప్లైకి మరోసారి నాగబాబు థ్రెడ్స్‌ వేదికగా స్పందిస్తూ కీర్తిని కోల్పోయిన కీర్తిశేషులు వర్మగారికి నా ప్రగాఢ సానుభూతి’ అంటూ షాకింగ్‌గా స్పందించారు. వర్మ గారు విూరు నా పోస్ట్‌కి స్పందించినందుకు చాల సంతోషంగా ఉంది కొంచెం షాక్‌కి కూడ గురయ్యాను. ఎందుకంటే విూరు చనిపోయి దాదాపు ఇరవై ఏళ్లు దాటింది ఇంకా బతికున్నాను అనుకుని తిరుగుతున్నారు.

విూ ఆత్మ మాత్రమే తిరుగుతోంది అది గ్రహించాలి విూరు, ఏదోక రూపంలో నా పోస్ట్‌కి బదులు ఇచ్చినందుకు సంతోషం, ఇప్పటికి విూ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. కీర్తిని కోల్పోయిన కీర్తిశేషులు వర్మ గారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను… అని మెగాబ్రదర్‌ నాగబాబు థ్రెడ్స్‌లో పోస్ట్‌ చేశారు. అంతకు ముందు.. ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసిన వర్మను ఉద్దేశించి.. ఆర్జీవీ గారిపై అటువంటి వ్యాఖ్యలు చేయడం తప్పు.. నేను కూడా వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను.

ఆర్జీవీగారూ విూరేం భయపడకండి.. విూ జీవితానికి ఏ డోఖా లేదు. విూ ప్రాణానికి ఏ అపాయం వాటిల్లదని నేను హావిూ ఇస్తున్నాను. ఎందుకంటే.. ఆంధప్రదేశ్‌లో.. ఆ మాటకొస్తే ఇండియాలో ఏ పనికిమాలిన వెధవ విూకెటువంటి హాని తలపెట్టడు. ఎందుకంటే హీరో, విలన్‌ కొట్టుకుంటుంటే మధ్యలో కమెడియన్‌ గాడ్ని ఎవడు చంపడు కదా.. విూరేం వర్రీ అవకండి. నిశ్చింతగా, నిర్భయంగా ఓ ఓడ్కా పెగ్గేసి పడుకోండి. విూ శ్రేయోభిలాషి‘ అంటూ నాగబాబు పోస్ట్‌ చేశారు.

ఈ పోస్ట్‌కు వర్మ స్పందిస్తూ.. ‘సార్‌ నా కన్నా పెద్ద కమెడియన్‌ ఎవడంటే.. నా సినిమాలో విూరు.. విూ తమ్ముడి దగ్గర డబ్బులడుక్కుని టీ తాగి పడుకోండి అని పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌లను చూసిన వారంతా.. మళ్లీ నాగబాబు, వర్మల మధ్య యుద్ధం మొదలైందిరో.. అంటూ కామెంట్స్‌ చేస్తుండటం గమనార్హం.