‘విరూపాక్ష’ మెగా సక్సెస్ పార్టీ.! ఆన్ ద వే.!

యాక్సిడెంట్ తర్వాత అనూహ్యమైన హిట్ కొట్టాడు సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ సినిమాతో. అస్సలు ఎవ్వరూ ఊహించలేదు ఈ సినిమాతో తేజుకి ఇంత పెద్ద సక్సెస్ వస్తుందనీ. ఈ సక్సెస్‌ని మరింత ఎంజాయ్ చేసేలా ఓ మెగా ఈవెంట్ ప్లాన్ చేయబోతున్నారట. ఈ ఈవెంట్‌కి మెగా హీరోలంతా అటెండ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట.

మెగా హీరోలతో పాటూ, తేజుకి అత్యంత సన్నిహితులైన ఎన్టీయార్ తదితర హీరోలూ, పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ గేదరింగ్‌లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై తేజు, పెద్ద మామయ్య మెగాస్టార్ చిరంజీవితో సంప్రదింపులు చేస్తున్నాడట. అయితే, ఎంత మంది హీరోలు ఈ పార్టీకి అటెండ్ అవుతారో అనేది ఇంకా స్పష్టత రావల్సి వుంది.

రెండు మూడు రోజుల్లో ఆ విషయమై ఓ స్పష్టత రానుందట. యాక్సిడెంట్ తర్వాత ఇది తేజుకి పునర్జన్మగానే భావించాలి. కేవలం సినిమా సక్సెస్ పార్టీ అన్నట్లు కాకుండా, యాక్సిడెంట్ నుంచి పూర్తిగా కోలుకున్న తేజు కోసం చిరంజీవి అండ్ ఫ్యామిలీనే ఈ తరహా పార్టీ ఒకటి సెలబ్రేట్ చేయాలని అనుకుంటున్నారట.

ఎలాగూ సినిమాతో హిట్ కొట్టాడు. అలా రెండూ కలిసొచ్చేలా ఈ పార్టీని గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారట. చూడాలి మరి, ఎంతమంది ఈ పార్టీ కోసం అందుబాటులో వుంటారో.