Virat Kohli: ఒక్క మ్యాచ్‌లో మూడు రికార్డులు.. కోహ్లీ మ్యాజిక్‌!

శనివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం నమోదు చేయగా, విరాట్ కోహ్లీ మరోసారి తన బ్యాటుతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 33 బంతుల్లో 62 పరుగులు చేసిన కోహ్లీ మూడు కీలక రికార్డులను బద్దలు కొట్టాడు. ముఖ్యంగా సీఎస్‌కేపై అతను 1,146 పరుగులు నమోదు చేయడం విశేషం.

ఇది ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టుపై అత్యధిక పరుగుల రికార్డు కావడం గమనార్హం. కోహ్లీ ఈ విజయంతో డేవిడ్ వార్నర్‌ను వెనక్కు నెట్టాడు. వార్నర్ పంజాబ్‌పై 1,134 పరుగులతో ఆ రికార్డు కలిగి ఉండగా, ఇప్పుడు కోహ్లీ అతనిని దాటేశాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు కోహ్లీ 7 హాఫ్ సెంచరీలు కొట్టి, ఈ సీజన్‌లో కూడా రన్ మెషీన్‌ అని మరోసారి రుజువు చేశాడు. ప్రత్యర్థి జట్లపై అతని స్టాటిస్టిక్స్ చూస్తేనే కోహ్లీ స్థాయికి అర్థమవుతుంది.

ఇదిలా ఉండగా, బెంగళూరు 213 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, సీఎస్‌కే చివరి ఓవర్ వరకూ పోరాడింది. యువ ఆటగాడు ఆయుష్ మాత్రే 94 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడగా, జడేజా కూడా 77 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కానీ చివర్లో ఆర్సీబీ బౌలర్ యశ్ దయాల్ కూల్‌గా బౌలింగ్ చేస్తూ మ్యాచ్‌ను బెంగళూరుకు అందించాడు. ఈ విజయంతో ప్లేఆఫ్స్ దిశగా మరింత బలంగా అడుగులు వేసిన ఆర్సీబీ, అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

Big Shocking about Janulyri | Janulyri Son | Folk Singer Janulyri | Latest News | Telugu Rajyam