Hero Vijay: పునీత్ రాజ్ కుమార్ కు నివాళులు అర్పించిన విజయ్….ఇప్పుడు తీరిందా అంటూ ట్రోల్స్!

Hero Vijay: కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ 2021 అక్టోబర్ 29న గుండెపోటుతో మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. 46ఏళ్ల చిన్న వయస్సులో ఆయన మరణం అటు ఫ్యాన్స్ తో పాటు అందరిని షాక్ కు గురి చేసింది. ఆయన చివరి చూపు కోసం చాలామంది ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు తరలివచ్చి, అంతిమయాత్రలో పాల్గొన్నారు.

దేశవ్యాప్తంగా చాలా మంది సినీ ప్రముఖులు బెంగళూరు తరలివచ్చి ఆయనకు నివాళులు అర్పించారు. ఇప్పటికీ ఆయన అభిమానులు సమాధి వద్దకు వచ్చి బాధపడుతూనే ఉంటారు. ఆయనకు నివాళులు అర్పించడానికి చాలామంది సెలబ్రిటీలు వచ్చారు కానీ తమిళ ఇండస్ట్రీ నుంచి మాత్రం ఎవరూ రాలేదు అని అప్పట్లో చర్చనీయాంశం అయింది. తమిళ్ ఇండస్ట్రీకి సంబంధించి హీరో విశాల్ మాత్రం పునీత్ రాజ్ కుమార్ కు నివాళులర్పించారు.

తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ కంఠీరవ స్టూడియోలోని పునీత్ రాజ్ కుమార్ సమాధిని సందర్శించి ఆయనకు నివాళులు అర్పించారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు హీరో విజయ్ పై పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ చనిపోయిన ఇంతకాలానికి విజయ్ కు తీరిక దొరికిందా అని అభిమానులతో పాటు సోషల్ మీడియాలో కూడా విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు కూడా విజయ్ ఏదో పనిమీద బెంగళూరు వచ్చి.. పనిలో పనిగా నివాళులు అర్పించడానికి వచ్చారని సోషల్ మీడియాలో గట్టిగానే విమర్శలు ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియాలో విజయ్ పై వస్తున్న విమర్శలకు ఫ్యాన్స్ కవర్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు.