ఒక్క సీన్ తో బాలయ్యకి షాక్ ఇచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్..?

తమిళ హీరో శరత్ కుమార్ వారసురాలిగా వరలక్ష్మి శరత్ కుమార్ తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టి “పోడా పొడి” అనే తమిళ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి ఎన్నో సినిమాలలో కీలక పాత్రలలో నటించింది. ఇక “తెనాలి రామకృష్ణ” సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వరలక్ష్మి ఆ సినిమాలో తన పాత్రకు న్యాయం చేసి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం. ఆ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన క్రాక్ సినిమాలో జయమ్మ అనే ఒక పవర్ఫుల్ పాత్రలో నటించి మంచి గుర్తింపు పొందింది. ఈ జయమ్మ పాత్ర ద్వారా వరలక్ష్మి కెరీర్ మలుపు తిరిగిందని చెప్పటంలో సందేహం లేదు.

ఈ పాత్ర ద్వారా వరలక్ష్మికి వచ్చిన పాపులారిటీతో టాలీవుడ్ లో వరుస సినిమాలలో నటించే అవకాశాలు అందుకుంటుంది. అంతేకాకుండా వరలక్ష్మి కోసం కొంతమంది దర్శకులు ప్రత్యేక పాత్రలను క్రియేట్ చేసి ఆమె కోసం కథ రాస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రస్తుతం తెలుగులో దాదాపు అరడజను సినిమాలలో నటిస్తూ వరలక్ష్మి బిజీగా ఉంది. ఇదిలా ఉండగా బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న వీరసింహారెడ్డి సినిమాలో కూడా వరలక్ష్మి ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణకు దీటుగా నిలబడే ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ లో వరలక్ష్మి కనిపించబోతోంది.

తాజాగా వీరిద్దరికి సంబంధించిన సన్నివేశాలను ఇటీవల షూట్ చేసినట్లు సమాచారం. ఈ సన్నివేశంలో వరలక్ష్మి అయిదు పేజీల డైలాగ్ ని సింగిల్ టేక్ లో చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే వరలక్ష్మి శరత్ కుమార్ ఇలా సింగిల్ టేక్ లో ఐదు పేజీల డైలాగ్ చెప్పటంతో బాలకృష్ణ కూడా షాక్ అయినట్లు సమాచారం. బాలయ్య కాంబినేషన్ లో సీన్ కావడంతో వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సీన్ ని చేయడం అంత ఈజీ కాదని అంతా భావించారు. అయితే వరలక్ష్మి మాత్రం చాలా సునాయాసంగా సింగిల్ టేక్ లో డైలాగ్ చెప్పటంతో బాలకృష్ణతో పాటు సెట్ లో ఉన్న అందరూ షాక్ అయినట్లు తెలుస్తోంది.