ఎన్టీఆర్ , ప్రభాస్ రికార్డ్స్ బద్దలు కొట్టిన ‘ వైష్ణవ్ తేజ్’

మెగా హీరో పంజా వైష్ణ‌వ్‌ తేజ్ డెబ్యూ మూవీ ఉప్పెన‌ ఏ శుభ ముహూర్తంలో ప్రారంభ‌మైందో కానీ.. విడుద‌ల త‌ర్వాత క‌లెక్ష‌న్స్ ప‌రంగా రికార్డుల‌ను క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. ఓ డెబ్యూ హీరో సినిమాకు ఈ మేర‌కు క‌లెక్ష‌న్స్ రావ‌డం రికార్డ్ అని ట్రేడ్ వ‌ర్గాలు చెప్పేశాయి. ఫిబ్ర‌వ‌రి నెల‌లో విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించిన తెలుగు సినిమాల్లోనూ ఉప్పెన ఓ రిక్డార్ క్రియేట్ చేసింద‌ని తాజాస‌మాచారం.

ఉప్పెన సినిమాకు రు.49 కోట్లు షేర్ క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసింది. 2017లో విడుద‌లైన నేను లోక‌ల్ సినిమాకు రు.35 కోట్లు వ‌సూళ్లు వ‌చ్చాయి. 2015లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన టెంప‌ర్ కూడా ఫిబ్ర‌వరిలోనే విడుద‌లైంది. టెంప‌ర్ సినిమాకు రు.44.4కోట్లు వ‌సూళ్లు వ‌చ్చాయి. అలాగే 2013లో విడుద‌లైన ప్ర‌భాస్ మిర్చి సినిమా రు.48.5 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసింది.

ఈ లెక్క‌న చూస్తే ఫిబ్ర‌వ‌రిలో నెల‌లో విడుద‌లై భారీ క‌లెక్ష‌న్స్ సాధించిన స్టార్ హీరోలైన ప్ర‌భాస్, ఎన్టీఆర్ సినిమాల‌కు కూడా ఉప్పెన క‌లెక్ష‌న్స ప‌రంగా క్రాస్ చేసేసింది. త‌మ మెగా క్యాంప్ హీరో తొలి సినిమాతోనే ఇలా రికార్డులు క్రియేట్ చేయ‌డంతో మెగా ఫ్యాన్స్ సంబ‌రాల‌కు హ‌ద్దే లేకుండా పోయింది. మా వైష్ణ‌వ్ తేజ్ తోపు అని సంబ‌ర‌ప‌డుతున్నారు. మ‌రో రెండు వ‌రుస హిట్ సినిమాలు ప‌డితే ఇక వైష్ణ‌వ్ తేజ్ స్టార్ హీరోల లిస్టులో చేర‌డం ప‌క్కా అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.