త్రివిక్రం – మహేష్ బాబు కాంబో సినిమా మీద లేటెస్ట్ అప్‌డేట్ తో ఫ్యాన్స్ షాకవుతారేమో ..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు సినిమా టాలీవుడ్ లో సైలెంట్ హిట్ ను సాదించింది. బుల్లి తెరపై సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత చేసిన ఖలేజా మూవీ థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా..మహేష్ అభిమానుల్లో మాత్రం హిట్ ను సాధించిందనే చెప్పాలి. అంతేకాదు ఖలేజా బిగ్గెస్ట్ టెలివిజన్ హిట్ గా నిలిచింది.

త్రివిక్రం - మహేష్ బాబు కాంబో సినిమా మీద లేటెస్ట్ అప్‌డేట్ తో ఫ్యాన్స్ షాకవుతారేమో ..?

ఇక ఈ మూవీలో మహేష్ క్యారెక్టర్ కు చాలా మంది ఫిదా అయ్యారు. అందుకే ఖలేజా మహేష్ కి కొత్త ఇమేజ్ ని తీసుకు వచ్చింది. కాగా మరోసారి మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ హిట్ వస్తే బాగుంటుందని మహేష్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకుల నాడి తెలుసుకున్న వీరిద్దరూ కలిసి ఓ ప్రాజెక్ట్ చేద్దామనుకున్నారు. అప్పట్లో మహేష్ మా ఇద్దరి కాంబోలో ఓ సినిమా వస్తుందని అనౌన్స్ చేశారు. దీంతో సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు పై భారీ అంచనాలే పెరిగాయి.

Why Mahesh's Khaleja movie ended up as a disaster? | An opinion by Abhiram  - Thatsokdude

కానీ తాజా సమాచారం ప్రకారం త్రివిక్రం – మహేష్ కాంబోలో మూవీ పట్టాలెక్కేలా కనిపించడం లేదు. ప్రస్తుతం త్రివిక్రమ్, మహేష్ బాబు ఇద్దరూ సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. ఇద్దరూ కూడా సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ ను ఇప్పటి వరకు చెప్పలేదు. మహేష్ సర్కారు వారి పాట ఆ తర్వాత రాజమౌళి తో భారీ పాన్ ఇండియన్ సినిమా చేయబోతున్నాడు. ఇక త్రివిక్రం ఎన్.టి.ఆర్ తో పాన్ ఇండియన్ సినిమా చేసేందుకు సిద్దమవుతున్నాడు. దీంతో వీరిద్దరి కాంబోలో మరో 2 ఏళ్ల వరకు సినిమా రాదన్న వార్తలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి.