‘విశ్వంభర’లో చిరు సరసన త్రిష!

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ ‘విశ్వంభర’. పాన్‌ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమాకు ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతుండగా యువీ క్రియేషన్స్‌ సంస్థ సుమారు రూ. 200 కోట్లతో బ్జడెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తుంది. ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఎం. ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇక ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్‌లో చిరంజీవి కూడా జాయిన్‌ అయ్యారు. ఈ సినిమా కోసం చిరంజీవి ఫిజికల్‌గా ఫిట్‌గా తయారయ్యారు. దీనికి సంబంధించి ఇటీవల ఆయన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన జిమ్‌ వీడియో వైరల్‌గా మారింది. ఇదిలావుంటే ఈ సినిమాకు సంబంధించి సాలిడ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌.

ఈ మూవీలో కోలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నట్లు చిత్రయూనిట్‌ తెలిపారు. ఇక ‘విశ్వంభర’ షూటింగ్‌లో చిరంజీవితో పాటు త్రిష కూడా జాయిన్‌ అయినట్లు వెల్లడించారు. 18ఏళ్ల క్రితం చిరంజీవితో ‘స్టాలిన్‌’ సినిమాలో నటించింది త్రిష. మళ్లీ ఇన్నాళ్లకు మెగాస్టార్‌తో జతకట్టనుంది. మెగా అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే.!