అల్లు అర్జున్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..?

టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గంగోత్రి సినిమా ద్వారా హీరోగా తన కెరియర్ ప్రారంభించిన అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందాడు. ఇక అల్లు అర్జున్ నటించిన చాలా సినిమాలకు ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించాడు. అల్లు అర్జున్ సినిమాల కోసం దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమా హిట్ కి బాగా ఉపయోగపడింది. ఇటీవల పుష్ప సినిమా కోసం దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పటికి ఎక్కడ చూసినా కూడా పుష్ప సినిమాలోని పాటలే వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా ఇటీవల దేవి శ్రీ ప్రసాద్ సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ అభిమానులకు క్షమాపణలు తెలియజేస్తాడు. అసలు విషయం ఏమిటంటే ఇటీవల దేవిశ్రీప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశాడు. అయితే ఆ సమయంలో ట్విట్టర్ లో ఆక్టివ్ గా లేని దేవి శ్రీ ప్రసాద్ అల్లు అర్జున్ చేసినట్వీట్ ని చూసుకోలేదు. ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ ట్వీట్ ను చూసిన దేవిశ్రీ ప్రసాద్ ఆ ట్వీట్ కి కృతజ్ఞతలు తెలుపుతూ రీ ట్వీట్ చేశాడు.

అంతే కాకుండా ఈ సందర్భంగా అల్లు అర్జున్ అభిమానులకు క్షమాపణలు కూడా కోరారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ నటించబోయే పుష్ప 2 సినిమా కోసం అదరగొట్టే ఆల్బమ్ సిద్ధమవుతుందని , ఆల్బమ్ ను కూడా ఐకానిక్ గా మారుద్దామని దేవిశ్రీప్రసాద్ రాసుకొచ్చారు. ఇలా బన్నీ అభిమానులకు దేవిశ్రీ క్షమాపనలు చెబుతూ పాజిటివ్ గా ట్వీట్ చేయడంతో బన్నీ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదిలా ఉండగా పుష్ప 2 సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.