రామ్ – దేవరకొండ.. ఈసారి నష్టపోతే కష్టమే..

ప్రస్తుతం యువ హీరోలు చాలామంది కూడా సక్సెస్ లేక సతమతమవుతున్నారు. ఇక ప్రస్తుతం రామ్ పోతినేని విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా బాక్సాఫీస్ వద్ద తప్పనిసరిగా సక్సెస్ అందుకోవాల్సిన సమయం అయితే వచ్చేసింది. విజయ్ దేవరకొండ ఖుషి సినిమా సెప్టెంబర్ 1వ తేదీన వస్తుండగా రామ్ పోతినేని బోయపాటి దర్శకత్వంలో చేసిన స్కంద సినిమా సెప్టెంబర్ 15వ తేదీన రానుంది.

రెండు కూడా భారీ బడ్జెట్లో పాన్ ఇండియా స్థాయిలోనే విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ముందుగా విజయ్ దేవరకొండ అయితే ప్రమోషన్స్ కూడా గట్టిగానే స్టార్ట్ చేసేసాడు. ఖుషి సినిమాకు ప్రస్తుతం అన్ని రకాలుగా అన్ని మార్గాలలో మంచి ప్రమోషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాపై మైత్రి మూవీ మేకర్స్ దాదాపు 60 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది.

తప్పనిసరిగా విజయ్ దేవరకొండ తన స్టార్ ఇమేజ్ తో 60 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ అందించాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకంటే ఇంతకుముందు అతను చేసిన లైగర్ సినిమా దాదాపు 60 కోట్ల స్థాయిలోనే నష్టాలను మిగిల్చింది. కాబట్టి ఈ సినిమాతో సక్సెస్ అందుకొని అతడు మార్కెట్ ను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మరోవైపు రామ్ పోతినేని పరిస్థితి కూడా దాదాపు అదే తరహాలో ఉంది.

అతను చివరగా చేసిన ది వారియర్ సినిమా వలన నిర్మాతలకు 17 కోట్ల స్థాయిలోనే నష్టాలు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు స్కంద సినిమాతో కూడా అతను 60 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సిన అవసరం ఉంది. దర్శకుడు బోయపాటి కాబట్టి మాస్ ఆడియన్స్ లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. కానీ కంటెంట్ క్లిక్ అయితేనే ఈ సినిమా ఆ రేంజ్ లో సక్సెస్ అవుతుంది. మరి సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.