త్రివిక్రం కి ఆ ఇద్దరు హీరోయిన్స్ ఒకటే … అయినా పెద్ద కన్‌ఫ్యూజన్ లో ఉన్నాడట ..?

మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ – యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కాంబినేషన్‌లో ఒక సినిమా తెరక్కడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అరవింద సమేత వీర రాఘవ తో ఈ ఇద్దరు మంచి కమర్షియల్ హిట్ ని అందుకున్నారు. దాంతో మరోసారి ఈ కాంబినేషన్ రిపీటవుతుండటం తో నందమూరి అభిమానుల్లోనే కాదు ప్రేక్షకులందరిలోను భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ఎన్.టి.ఆర్ కెరీర్ లో తెరకెక్కబోయో 30 వ సినిమా కావడం కూడా విశేషం.

NTR 30 Movie | Cast, Release Date, Trailer, Posters, Reviews, News, Photos  & Videos | Moviekoop

అందుకు తగ్గట్టుగానే త్రివిక్రం ఎన్.టి.ఆర్ కోసం యూనివర్సల్ పాయింట్ తో స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట. ఇక ఈ సినిమాని హారిక అండ్ హాసిని, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకాలపై రాధాకృష్ణ – కళ్యాణ్ రాం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఎన్.టి.ఆర్.. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా నుంచి రిలీజైన రామరాజు ఫర్ భీం సినిమా మీద భారీ అంచనాలని నెలకొల్పింది. కాగా ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.
ఆర్ ఆర్ ఆర్ లో ఎన్.టి.ఆర్ మీద జరిగే చిత్రీకరణ 2021 ఫిబ్రవరి వరకు కంప్లీటవుతుందని సమాచారం. అందుకే ఫిబ్రవరి నుంచి త్రివిక్రం సినిమా మొదలు పెట్టాలని భావిస్తున్నాడట.

Pooja Hegde | Stylish actresses, Indian actress hot pics, Beautiful indian  actress

అయితే ఇప్పుడు త్రివిక్రం ఒక కన్‌ఫ్యూజన్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ కి జంటగా ఏ హీరోయిన్ ని తీసుకోవాలన్నది పెద్ద డైలమాగా ఉందట. ప్రస్తుతం టాలీవుడ్ లో కీర్తి సురేష్ – పూజా హెగ్డే ఇద్దరూ టాప్ హీరోయిన్స్. ఇద్దరికి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. కాగా ఇప్పటికే కీర్తి సురేష్ – పూజా హెగ్డే త్రివిక్రం దర్శకత్వంలో నటించారు.

Keerthi Suresh Beat Pooja Hegde And Rashmika On Movie Race Tollywood Telugu  Cinema South - Tol-TeluguStop

కాని ఎన్.టి.ఆర్ తో పూజా హెగ్డే నటించింది.. తప్ప కీర్తి సురేష్ నటించలేదు. ఈ కారణంగా అందరూ కీర్తి సురేష్ అయితే బావుటుందన్న అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారట. ఇద్దరికి త్రివిక్రం అంటే అభిమానం .. గౌరవం ఉంది. మరి ఎవరి ఈ సినిమాలో ఛాన్స్ ఇస్తాడో చూడాలి.