అనుష్క అందుకే స్కిప్ కొట్టిందా?

తెలుగు సినిమా దగ్గర భారీ స్టార్డం ఉన్న ప్రెజెంట్ జెనరేషన్ హీరోయిన్స్ లో లేడీ సూపర్ స్టార్ అనుష్క ఒకే ఒకరు అని చెప్పడంలో సందేహం లేదు. అయితే టాలీవుడ్ మార్కెట్ 30, 40 కోట్ల మధ్యలో ఉన్న సమయంలోనే ఏకంగా 30 కోట్లు బాక్సాఫీస్ వసూళ్లు ఉన్న హీరోయిన్ గా అనుష్క నిలవగా..

అక్కడ నుంచి తన లెగసి ని టాలీవుడ్ లో స్టార్ట్ చేసింది. అంత స్టార్డం ఉన్నప్పటికీ పెద్దగా సోషల్ మీడియాలో ఆక్టివ్ ఆమె ఉండదు. అయినా కూడా ఆమెకి పడి చచ్చేంత ఫాలోయింగ్ చెక్కు చెదరలేదు. కాగా ఆమె హీరోయిన్ గా నటించిన మోస్ట్ అవైటెడ్ సినిమా “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” రిలీజ్ తో ఇప్పుడు రాగా ఫ్యాన్స్ కి ఫీస్ట్ దక్కినట్టు అయ్యింది.

యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా దర్శకుడు మహేష్ బాబు తెరకెక్కించిన ఈ చిత్రం విడుదల కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో షాకింగ్ గా అనుష్క ఎక్కడ కూడా కనిపించలేదు. అయితే దీనికి బలమైన కారణమే ఉందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి ముందు నుంచి క్రేజ్ అనుష్క చాలా కాలం తర్వాత వస్తుంది అనే ఉంది..

దీనితో ఆమె స్టార్డం ముందు హీరో చిన్నబోయాడు. అందుకే తనకంటే హీరోకి ఎక్కువ గుర్తింపు రావాలి అని ఆమె మొత్తం నవీన్ కే వదిలేసింది అని రూమర్స్ ఇపుడు వినిపిస్తున్నాయి. సో అందుకే అనుష్క స్కిప్ కొట్టేసింది అని భోగట్టా..కాగా ఈ చిత్రాన్ని అయితే యూవీ క్రియేషన్స్ నిర్మాణం వహించారు.