షాకింగ్ : “సింహాద్రి” రీ రిలీజ్ కి అంత ఖర్చు పెట్టారా?

ప్రస్తుతం టాలీవుడ్ సినిమా దగ్గర కొనసాగుతున్న రీ రిలీజ్ ట్రెండ్స్ లో ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వంతు వచ్చింది. గత మార్చ్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన “ఆరెంజ్” చిత్రం రీ రిలీజ్ కాగా ఇక ఈ మే లో అయితే ఎన్టీఆర్ నటించిన “సింహాద్రి” రీ రిలీజ్ కాబోతుంది.

అయితే అప్పట్లో ఈ సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా ఈసారి మాత్రం ఈ సినిమా రీ రిలీజ్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా సీరియస్ గా తీసుకొని భారీ ప్లానింగ్ లు చేసుకుంటున్నారు. ఆల్రెడీ వరల్డ్ లోనే బిగ్గెస్ట్ ఐమ్యాక్స్ లో షో ప్లాన్ చేయడం పైగా సాంగ్ లిరికల్ సాంగ్స్ ని థియేటర్స్ లో రిలీజ్ చేయడం పైగా వాటికి ఈవెంట్లు కూడా ప్లాన్ చేయడం. 

ఇది చాలవు అన్నట్టు ఆఫ్ లైన్ లో కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్ లు, సింహాద్రి మార్చండైజ్ లు  చాలానే చేస్తున్నారు. దీనితో అయితే ఈ ప్రమోషన్స్ కి గానే ఖర్చు చేసినట్టుగా సినీ వర్గాలలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ సమాచారం ప్రకారం అయితే ఏకంగా ఒక కోటిన్నరకి పైగానే ఫ్యాన్స్, పెద్దలు ఖర్చు చేసారని తెలుస్తుంది.

ఇదైతే కొన్ని సినిమాల రిలీజ్ కి వచ్చే వసూళ్ళని చెప్పాలి. మరి ఈ రేంజ్ లో హంగామా చేస్తున్న ఈ సినిమా అయితే రీ రిలీజ్ లో ఎంత మేర వసూళ్లు రాబడుతుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి కూడా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించగా ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు. అలాగే విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. అలాగే ఈ సినిమాలో భూమిక హీరోయిన్ గా నటించగా బ్రహ్మానందం, నాజర్, వేణుమాధవ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.