బాలయ్య కోసం ఆ ముద్దుగుమ్మల ఎదురు చూపులు.!

ఫేమ్‌లో లేని హీరోయిన్లకు అవకాశాలివ్వడంలో నందమూరి హీరో బాలయ్య ముందుంటారు. ‘అఖండ’ సినిమా కోసం ఫేడవుట్ అయిపోయిన ప్రగ్యా జైశ్వాల్‌ని తీసుకొచ్చాడు.

అంతులేని విజయం కట్టబెట్టాడు. ‘అఖండ’ వంటి సూపర్ డూపర్ హిట్ కొట్టినా అదేంటో.! ప్రగ్యా జైశ్వాల్‌ కెరీర్‌కి అదేమాత్రం పని చేయలేదు. ఆ తర్వాత మళ్లీ మరో ఛాన్స్ రాలేదు. అలాగే, హనీరోజ్.. ఈ పేరు ఈ మధ్య తెగ మార్మోగిపోయిన సంగతి తెలిసిందే. ‘వీర సింహారెడ్డి’ సినిమాలో నటించింది. ఏమాత్రం క్రేజ్ లేని మలయాళ నటి. అలాంటిది బాలయ్య సినిమాతో పిచ్చ పిచ్చగా క్రేజ్ దక్కించుకుంది.

అందుకే ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు మళ్లీ బాలయ్య సినిమాలోనే నటించేందుకు ఎదురు చూస్తున్నారట. ‘అఖండ’ సీక్వెల్ వుంటుందని అప్పుడే డైరెక్టర్ బోయపాటి చెప్పారు. ఆ సీక్వెల్ గనుక సెట్ అయితే, ప్రగ్యా మళ్లీ బాలయ్యతో ఆన్ స్ర్కీన్ రొమాన్స్ చేయొచ్చనుకుంటోందట.

అలాగే, హనీ రోజ్‌కీ ఇంకో ఛాన్స్ ఇస్తానని బాలయ్య మాటిచ్చాడట. ఆ ఛాన్స్ ఎప్పుడెప్పుడా అని కలలు కంటోందట.