భర్త ముఖం పగలగొట్టిన స్టార్ హీరోయిన్

సినీ సెలెబ్రిటీల పర్సనల్‌ లైఫ్‌లోకి తొంగి చూడాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. వాళ్లు ఎప్పుడు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియా వాడకం పెరగడంతో అలాంటి వాటికి మంచి మార్గం దొరికినట్లు అయింది. దీన్ని వాడుకుని చాలా మంది సెలెబ్రిటీల పర్సనల్ విషయాలను బయటపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.

మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లోని సినీ ప్రముఖుల పర్సనల్ అండ్ ప్రైవేట్ మేటర్లను సోషల్ మీడియాలో పెట్టే వాళ్లు చాలా మందే ఉన్నారు. అందులో ప్రముఖ సినీ విమర్శకుడు, సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు ఒకడు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఎంతో మంది హీరో, హీరోయిన్లను అతడు టార్గెట్ చేస్తూ తెగ పోస్టులు చేస్తోన్న విషయం తెలిసిందే.

సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే ఉమైర్ సంధు తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో సినీ జంట కరీనా కపూర్ – సైఫ్ అలీ ఖాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అందులో ‘కరీనా కపూర్ గత రాత్రి తన భర్త సైఫ్ అలీ ఖాన్‌తో పెద్ద గొడవ పడింది. సైఫ్ ముఖంగా కరీనా దారుణంగా కొట్టింది. వీళ్లిద్దరి మధ్య ఏదో పెద్ద గొడవే జరిగింది. కానీ, దాన్ని ఇప్పుడు రివీల్ చేయను’ అని చెప్పాడు.

ఉమైర్ సంధు చేసిన ఈ ట్వీట్ పెద్ద దుమారాన్నే రేపింది. ముఖ్యంగా కరీనా కపూర్ – సైఫ్ అలీ ఖాన్ జంటను ఆరాధించే ఎంతో మంది అభిమానులు ఇది నిజమో.. కాదో తెలియక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఉమైర్ సంధు గురించి తెలిసిన వాళ్లు మాత్రం ఈ ట్వీట్‌ను లైట్ తీసుకుంటున్నారు. మరోవైపు, కరీనా, సైఫ్ విడాకులు తీసుకోబోతున్నారని కూడా ప్రచారం మొదలైంది.

ఇదిలా ఉండగా.. కరీనా కపూర్ గత ఏడాది ‘లాల్ సింగ్ చద్దా’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఇది పరాజయం పాలైంది. దీని తర్వాత ఆమె మరో సినిమాను ఒప్పుకోలేదు. ఇక, సైఫ్ అలీ ఖాన్ మాత్రం వరుస చిత్రాలతో సందడి చేస్తోన్నాడు. ముఖ్యంగా అతడు ఇప్పుడు ‘ఆదిపురుష్’తో వస్తున్నాడు. అలాగే, ఎన్టీఆర్ సినిమాలో విలన్‌గానూ నటిస్తోన్నాడు.