కాంతార సీక్వెల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హీరో…?

ప్రస్తుతం సౌత్ నార్త్ ఇండస్ట్రీ అని తేడా లేకుండా ఎక్కడ చూసినా కూడా కన్నడ సినిమా కాంతార పేరు వినిపిస్తోంది. కన్నడ భాషలో రూపొందిన కాంతార సినిమా సెప్టెంబర్ 30వ తేదీన కన్నడ భాషలో విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తో కన్నడ సినీ ప్రతిభను మరొకసారి దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు తెలియజేసింది. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కన్నడ భాషలో మంచి హిట్ అవటంతో ఇతర భాషలలో ఈ సినిమాని డబ్ చేసి విడుదల చేస్తున్నారు.

తాజాగా తెలుగులో కూడా అల్లు అరవింద్ సమర్పణలో అక్టోబర్ 15వ తేదీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. తెలుగులో కూడా ప్రేక్షకుల నుండి ఊహించని విధంగా మంచి ఆదరణ లభించింది. దీంతో ఈ సినిమా తెలుగు కన్నడ భాషలలో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. 16 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా ఇప్పటికే 100 కోట్ల క్లబ్ లో చేరి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వటంతో హీరో రిషబ్ శెట్టి దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యాడు.

ఇదిలా ఉండగా తెలుగులో ఈ సినిమా మంచి హిట్ అవ్వటంతో అల్లు అరవింద్ ఇటీవల ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి గీత ఆర్ట్స్ పతాకంపై రిషబ్శెట్టి త్వరలోనే తెలుగు సినిమాలో నటించబోతున్నాడని వెల్లడించాడు. ఇక బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన కాంతారా సినిమా సీక్వెల్ గురించి హీరో రిషబ్ శెట్టి ని ప్రశ్నించగా.. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ గురించి ఎటువంటి ఆలోచనలు లేవని… రెండు నెలలు పూర్తిగా విశ్రాంతి తీసుకున్న తర్వాతే సీక్వెల్ గురించి ఆలోచిస్తానని వెల్లడించారు.