మరోసారి బయటపడ్డ బాలయ్య, నాగర్జున మద్య వైరం.. వైరల్ అవుతున్న వార్తలు?

సాధరణంగా ఇందృష్ట్రీలో ఉన్న నటీనటులు, హీరోలు, హీరోయిన్లు అందరూ కూడా ఎటువంటి గొడవలు లేకుండా కలిసే ఉన్నట్లు కవరింగ్ ఇస్తూ ఉంటారు. కానీ అంతర్గతంగా వారి మధ్య ఉన్న విభేదాలు గురించి అప్పుడప్పుడు వారి పి ఆర్ టీం ద్వారా బయటపడుతూ ఉంటాయి. ఇలా అలనాటి హీరోలు మధ్య ఉన్న విభేదాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. సీనియర్ ఎన్టీఆర్, నాగేశ్వరరావు మధ్య ఉన్న విభేదాలు గురించి అందరికీ తెలిసిందే. అయితే తమ తండ్రుల వారసత్వంగా నాగార్జున, బాలకృష్ణ మధ్య కూడా విభేదాలు కొనసాగుతున్నాయి. మీడియా ముందు మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని ప్రూవ్ చేయటానికి వీరు ప్రయత్నం చేస్తున్నారు. కానీ తాజాగా నాగార్జున, బాలకృష్ణ మధ్య ఉన్న గొడవల గురించి మరొకసారి వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో నాగేశ్వరరావు మరణించిన తర్వాత సంతాప సభ ఏర్పాటు చేసిన సమయంలో ఇండస్ట్రీలోని పెద్దలందరూ కూడా ఈ సభకు హాజరయ్యారు. కానీ బాలకృష్ణ మాత్రం ఈ సభకు హాజరుకాకపోవటం అప్పుడు వైరల్ అయింది. ఇక ప్రస్తుతం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అండ్ స్టాపబుల్ రియాలిటీ షోలో కూడా ఎందరో హీరోలు సందడి చేస్తున్నారు.కానీ అక్కినేని కుటుంబానికి చెందిన హీరోలకు మాత్రం ఈ షో యాజమాన్యం నుండి ఆహ్వానం అందకపోవటానికి బాలకృష్ణ కారణమని సమాచారం. ఇదిలా ఉండగా బిగ్ బాస్ రియాలిటీ షో లకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 3 నుండి సీజన్ 6 వరకు హోస్ట్ చేశారు.

అయితే బిగ్ బాస్ సీజన్ 7 లో మాత్రం నాగార్జున హోస్టింగ్ కి నో చెప్పినట్లు తెలుస్తోంది. అందువల్ల బిగ్ బాస్ టీం నాగార్జున స్థానంలో బాలకృష్ణని హోస్ట్ గా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటె అన్ స్టాపబుల్ టాక్ షో అంత హిట్ అవ్వటానికి బాలయ్య హోస్టింగ్ ముఖ్య కారణం అని అందరికీ తెలుసు. బిగ్ బాస్ సీజన్ 6 కి టీఆర్పీ రేటింగ్ తక్కువ రావటమే కాకుండా సీజన్ 7 నుండి నాగార్జున తప్పుకోవడంతో బాలయ్యను హోస్ట్ గా పెట్టాలని బిగ్ బాస్ టీం ప్రయత్నం చేస్తోంది. అయితే వీరిమధ్య ఉన్న విభేదాల కారణంగా ..బాలయ్య హోస్టింగ్ చేస్తే బిగ్ బాస్ సెట్ వేసుకోవటానికి అన్నపూర్ణ స్టూడియోస్ ఇవ్వనని నాగార్జున, అన్నపూర్ణ స్టూడియోస్ లో బిగ్ బాస్ సెట్ వేస్తే నేను హోస్ట్ చేయనని బాలయ్య పంతం పెట్టుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి.