సరోగసి ద్వారా బిడ్డను కనడానికి అదే కారణం – ప్రియాంక చోప్రా

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ సినిమాలలో మాత్రమే కాకుండా హాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా వరుస సినిమాలలో నటిస్తూ గ్లోబల్ ఐకాన్ స్థాయికి ఎదిగింది. ఇక తన కన్నా వయసులో చిన్నవాడైన ప్రముఖ పాప్‌సింగర్‌ నిక్ జోనాస్ తో ప్రేమలో పడింది. కొంతకాలం అతనితో డేటింగ్ చేసిన తర్వాత 2018 లో వివాహాం చేసుకుంది. వివాహాం తరువాత కూడా ఈ జంట ఎంతో ఆనందంగా జీవితాన్ని గడుపుతోంది. ఇక ప్రియాంక చోప్రా వివాహం తర్వాత కూడా హీరోయిన్ గా తన కెరీర్ కొనగిస్తోంది .

సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్ల కు సినిమా అవకాశాలు ఎక్కువగా ఉండవు. కానీ ప్రియాంక చోప్రా మాత్రం ఇటు బాలీవుడ్ అటు హాలీవుడ్ ఇండస్ట్రీలలో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉంటుంది. ఇక పెళ్లి తర్వాత పిల్లల విషయంలో ప్రియాంక చోప్రా తీసుకున్న నిర్ణయం చర్చనీయంగా మారింది. ప్రియాంక చోప్రా సాధారణ గర్భం ద్వారా పిల్లల్ని కనకుండా సరోగసి పద్ధతి ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రియాంక చోప్రా ఇలా సరోగసి ద్వారా పిల్లల్ని కనడంతో అనేక విమర్శలు ఎదుర్కొంది.

ఇది ఇలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక చోప్రా ఈ విషయం గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా మాట్లాడుతూ… ” నేను సరోగసి పద్ధతి ద్వారా పిల్లల్ని కనడంతో అందరూ నన్ను తప్పుగా భావించారు. నా అందం పాడవుతుందని నేను ఇలా సరోగసి ద్వారా పిల్లల్ని కన్నానని అపార్థం చేసుకున్నారు. నిజానికి నాకు అనారోగ్య సమస్యలు ఉండటం వల్లే ఈ పద్ధతి ద్వారా పిల్లల్ని కన్నాము అంటూ క్లారిటీ ఇచ్చింది. నా కూతురు మాల్తీ మేరీ చోప్రా జోనాస్ డెలవరీ డేట్ కంటే ముందే జన్మించింది. దీంతో తను పుట్టినప్పుడు నా చెయ్యి అంత సైజులో కూడా లేదు. ఆ సమయంలో నిక్, నేను చాలా బాధపడ్డాము. కానీ కొంతకాలం హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత తన ఆరోగ్యం కుదుటపడటంతో చాలా ఆనందపడ్డాము అంటూ చెప్పుకొచ్చింది.