కోలీవుడ్లో దళపతి విజయ్ తన కుమారుడు జాసన్ సంజయ్ను దర్శకుడిగా పరిచయం చేయబోతున్న సంగతి తెలిసిందే. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఆ డెబ్యూ సినిమాకు ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు తెలుగు పరిశ్రమలో కొత్త చర్చ మొదలైంది. ఎందుకంటే ఆ మూవీ సెట్స్కి యంగ్ హీరో అఖిల్ అక్కినేని హాజరయ్యాడు! ఆ సందర్భంలో జాసన్, అఖిల్, తమన్, సందీప్ కిషన్ తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఫోటోపై నెటిజన్లు పెట్టిన కామెంట్లు చకచకా మారిపోతున్నాయి. “అఖిల్ – జాసన్ సీక్రెట్ ప్రాజెక్ట్ ఫిక్స్ అయ్యిందా?” అనే ఊహాగానాలు వేగంగా పుట్టుకొస్తున్నాయి. “ఇద్దరూ కలిసే పెద్ద ప్లాన్ వుందేమో!” అని కొందరు అనగా, మరికొందరు మాత్రం “ఇది కేవలం ఫ్రెండ్లీ కలయిక” అని తేల్చేస్తున్నారు. కానీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం, జాసన్ డెబ్యూ మూవీకి అఖిల్ గెస్ట్ రోల్ చేయబోతున్నాడా? లేదా ఫ్యూచర్లో ఇద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారా? అనే ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది.
ఇక అఖిల్ విషయానికి వస్తే, ‘లెనిల్’ అనే మాస్ అవతార్ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి బజ్ తెచ్చింది. అఖిల్కి హిట్ కావాల్సిన అవసరం ఉన్న సమయంలో జాసన్ లాంటి క్రేజ్ ఉన్న దర్శకుడితో కలసి పని చేయడం తనకు పాజిటివ్ గా మారుతుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు, జాసన్ ప్రాజెక్ట్ను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తుండటం, తమిళ-తెలుగు మార్కెట్లో కొత్త కాంబినేషన్లకు గేట్లు తెరిచే అవకాశముంది.