నవీన్‌ పోలిశెట్టికి యాక్సిడెంట్‌.. బైక్‌ స్కిడ్‌ అయి పడిపోయినట్లు సమాచారం!

హీరో నవీన్‌ పోలిశెట్టికి అమెరికాలో బైక్‌ యాక్సిడెంట్‌ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తన తదుపరి సినిమా నిమిత్తం అమెరికాలో ఉన్న నవీన్‌ పోలిశెట్టి.. అక్కడ బైక్‌పై వెళుతుండగా.. బైక్‌ స్కిడ్‌ అవడంతో పడిపోయాడని, చేతికి బలమైన దెబ్బ తగిలినట్లుగా సమాచారం. ఆయనను రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్స్‌ సూచించారని తెలుస్తోంది. అయితే ఈ యాక్సిడెంట్‌ జరిగి రెండు మూడు రోజులు అవుతున్నా.. ఇంత వరకు బయటికి రాలేదు.

నవీన్‌ పోలిశెట్టి తన టీమ్‌కి ఈ విషయం తెలియ జేయడంతో.. అతనికి యాక్సిడెంట్‌ అయినట్లుగా వార్తలు బయటికి వచ్చాయి. ఈ యాక్సిడెంట్‌కి సంబంధించి నవీన్‌ పోలిశెట్టి మాత్రం ఎక్కడా స్పందించలేదు. ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతిరత్నాలు’, ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ సినిమాలతో నవీన్‌ పోలిశెట్టి హీరోగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.

ఎప్పుడూ నవ్వుతూ ఉంటూ.. తన చుట్టూ ఉన్నవారిని నవ్విస్తూ ఉండటం నవీన్‌ స్పెషాలిటీ. అందుకే ఆయనకు ప్రత్యేక ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏర్పడింది. సినిమాల విషయానికి వస్తే..’మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ సినిమా తర్వాత నవీన్‌ పోలిశెట్టి రెండు సినిమాలకు సైన్‌ చేశారు. ఒకటి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో కాగా, రెండోది స్క్రీన్స్‌ బ్యానర్‌లో ఉండనుంది. ప్రస్తుతం సితార బ్యానర్‌లో చేయాల్సిన సినిమాకు సంబంధించి స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయిందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి డైరెక్టర్‌ని ఫైనలైజ్‌ చేసే పనిలో టీమ్‌ ఉంది