సుహాస్‌ కొత్త సినిమా ‘గొర్రె పురాణం’

టాలీవుడ్‌ టాలెంటెడ్‌ నటుడు సుహాస్‌ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఇటీవలే ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌’, ‘ప్రసన్నవదనం’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సరికొత్త కథా, కథనాలతో వచ్చిన ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు మరో వినూత్న కథతో ఆడియన్స్‌ ముందుకు రానున్నాడు సుహాస్‌. అదే ‘గొర్రె పురాణం’.

బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుండి తాజాగా టీజర్‌ విడుదల చేశారు మేకర్స్‌. వినూత్న కథతో వస్తున్న ఈ టీజర్‌ చాలా కొత్తగా ఉంది. ఇప్పుడొక విూకొక బ్రేకింగ్‌ న్యూస్‌.. ఒక గ్రామంలో రెండు వర్గాల మధ్య ఒక గొర్రె చిచ్చు పెట్టింది. అనే వాయిస్‌ ఓవర్‌ తో స్టార్ట్‌ అయ్యింది ఈ టీజర్‌. తరువాత.. ఆ గొర్రె మాది అంటే మాది అని అంటూ హిందూ, ముస్లింలు వాదించుకుంటారు.

అలా చిన్నగా మొదలైన గొడవ గ్రామ సమస్యగా మారుతుంది. ఇక సుహాస్‌ జైల్లో ఖైదీలా కనిపించారు. మరి సుహాస్‌ కి ఆ గొర్రె పిల్లకి ఏమైనా సంబంధం ఉందా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ టీజర్‌ తో సినిమాపై మంచి ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేశారు. మరి మరో కొత్త కాన్సెప్ట్‌ తో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్నీస్‌ సాధిస్తుందో చూడాలి.